kashmir killings: అమాయకులపై పాక్ విషపు పడగ..!
బిహార్లోని భాగల్పూర్కు చెందిన 45 ఏళ్ల వీరేంద్ర పాస్వాన్ రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద. నలుగురు ఆడపిల్లలు.. ఇద్దరు మగపిల్లలకు తండ్రి. తన ఒక్కడి సంపాదన మీదే కుటుంబం గడుస్తుంది.
‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ పేరిట కొత్త ముసుగు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
బిహార్లోని భాగల్పూర్కు చెందిన 45 ఏళ్ల వీరేంద్ర పాస్వాన్ రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద. నలుగురు ఆడపిల్లలు.. ఇద్దరు మగపిల్లలకు తండ్రి. తన ఒక్కడి సంపాదన మీదే కుటుంబం గడుస్తోంది. అతడు గతంలో కోల్కతాలో వెల్డర్గా పని చేశాడు. కొవిడ్ దెబ్బకు ఆ ఫౌండ్రీ మూతపడటంతో కుటుంబ పోషణకు దారులు వెతికాడు.. తన బంధువులు సహా చాలా మంది గ్రామస్థులు ఉపాధి కోసం కశ్మీర్ వెళుతున్నారని తెలుసుకొని.. తనూ శ్రీనగర్కు వెళ్లాడు. ఓ చిన్న పానీపూరి బండి పెట్టుకొని రోజువారీ సంపాదించే చిరు ఆదాయాన్ని కూతురి పెళ్లి కోసం కూడబెట్టుకొంటున్నాడు. దుర్గా పూజ రోజుకు ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకొన్నాడు. కానీ, కశ్మీర్లో పాకిస్థాన్ పెంచి పోషిస్తోన్న ఉగ్ర విషసర్పాలు గత వారం వీరేంద్ర స్థానికేతరుడంటూ కాల్చి చంపాయి. పానీపూరి బండి పక్కనే నిర్జీవంగా పడి ఉన్న అతడి మృతదేహం చిత్రం నెటిజన్లను కంటతడిపెట్టించింది. అతడి ఆరుగురి పిల్లల భవిష్యత్తు ఒక్కసారిగా చీకటి మయం అయిపోయింది. కశ్మీర్ ప్రభుత్వం రూ.1.25లక్షలు, బిహార్ ప్రభుత్వం రూ.2 లక్షలు ఇస్తామని ప్రకటించాయి. ఈ మొత్తాలు వారికి చేరేందుకు సమయం పడుతుంది. ఈ లోపు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా ఆ కుటుంబ సభ్యుల వద్ద డబ్బు లేదు. వీరేందర్ మృతదేహానికి కశ్మీర్లోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఎక్కడైతే అతడిని స్థానికేతరుడిగా భావించి ఉగ్రవాదులు హత్య చేశారో అదే మట్టిలో అతడి శరీరం కలిసిపోయింది.
పాత ఉగ్రవాదుల కొత్త ముసుగు..!
తాజాగా కశ్మీర్లోని మైనార్టీలు, స్థానికేతరుల హత్యల వెనుక ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ అనే సంస్థ హస్తం ఉంది. కశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తిని తొలగించిన తొమ్మిది నెలల తర్వాత ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’(టిఆర్ఎఫ్) పేరు బయటకు వచ్చింది. 2020 ఏప్రిల్1వ తేదీన కుప్వారాలోని కెరాన్ ప్రాంతంలో మొదలైన ఎన్కౌంటర్ సందర్భంగా టీఆర్ఎఫ్ పేరు బయటకు వచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చిన ఐదుగురు దుండగులు ఓ ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. భారత భద్రతా దళాలు నాలుగు రోజులపాటు పోరాడాయి. చివరికి ఆర్మీ ప్రత్యేక కమాండోలు రంగలోకి దిగి వారిని మట్టుబెట్టారు. ఆ చనిపోయిన ఉగ్రవాదుల మృతదేహాలు ఎవరివో ఇప్పటికీ గుర్తించలేదు.
కశ్మీర్లో వేర్పాటు వాదానికి మతరంగు పులమటం కంటే రాజకీయ రంగు పులమడం మరింత సెక్యూలర్గా ఉంటుందని ఉగ్రవాదులు టీఆర్ఎఫ్ అనే పేరు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అక్కడ ఉన్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థల పేర్లు మతం రంగుతో ఉన్న విషయం తెలిసిందే. 1990ల్లో జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ తర్వాత ఈ వ్యూహంతో పేరు పెట్టుకొన్న సంస్థ ఇదే. వాస్తవానికి టీఆర్ఎఫ్తోపాటు కశ్మీర్లో ఉన్న యాంటీ ఫాసిస్ట్ఫ్రంట్ ఉగ్ర సంస్థ కూడా ఈ కోవకే వస్తుంది. ఈ రెండు సంస్థలు లష్కరే, జైషే సంస్థలకు క్లోన్లు.
తొలి కేడర్ను పాక్ రప్పించి శిక్షణ..!
టీఆర్ఎఫ్ తొలి తరం కేడర్లోని స్థానిక కశ్మీరీలకు వాఘా సరిహద్దు మీదుగా పాక్కు రప్పించి అక్కడ శిక్షణ ఇచ్చింది. మరికొందరు యువకులను నియంత్రణ రేఖ నుంచి అక్రమంగా భారత్లోకి పంపింది. ఈ ఆగస్టులో టీఆర్ఎఫ్ అగ్రనాయకులు అబ్బాస్ షేక్ను సైనిక దళాలు అంతమొందించాయి. స్పోర్ట్స్ వేర్ ధరించిన దళాలు అతని స్థావరాన్ని చుట్టుముట్టి కాల్చి చంపాయి. ఇతను గత పదేళ్లుగా వివిధ ఉగ్ర సంస్థల్లో పనిచేశాడు. ఇతర సంస్థల్లో పనిచేసిన పలువురు ఉగ్రవాదులు ఇప్పుడు టీఆర్ఎఫ్లో కనిపిస్తున్నట్లు దళాలు పేర్కొన్నాయి.
క్షేత్ర స్థాయిలో బలమైన నెట్వర్క్తో..
టీఆర్ఎఫ్కు క్షేత్ర స్థాయిలో పనిచేసే సానుభూతిపరులు, ఇన్ఫార్మర్లు భారీగా ఉన్నారు. భద్రతా దళాల నిఘాలో లేనివారిని ఇందుకోసం తీసుకుంటారు. ఈ ఉగ్ర సంస్థ తేలిగ్గా ఉండే లక్ష్యాలను ఎంచుకొంటుంది. తమ లక్ష్యాలకు సంబంధించిన సమాచారాన్ని ముందే తెలుసుకొని ఉగ్రవాదులు అక్కడకు చేరుకొంటారు. ఉగ్రదాడి మొత్తాన్ని బాడీ కెమెరాలతో చిత్రీకరిస్తారు. వీటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి మరికొంత మంది యువకులను ఆకర్షిస్తారు. గతేడాది నవంబర్లో శ్రీనగర్లో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఇద్దరు జవాన్లపై దాడిని ఇలానే చిత్రీకరించారు. తాము లక్ష్యంగా ఎంచుకొన్న వ్యక్తిపై వివిధ ఆరోపణలతో సామాజిక మాధ్యమాల్లో ఛార్జిషీట్లను కూడా పెడుతుంది. ఉగ్రవాదుల ఫొటోలను బయటకు రానీయకుండా ఈ సంస్థ గోప్యంగా ఉంచుతుంది.
లక్ష్యం ఏమిటీ..?
కశ్మీర్లో బయటి వ్యక్తుల చొరబాట్లను సైన్యం బలంగా అడ్డుకోవడంతో.. స్థానికంగా ఉన్న వివిధ ఉగ్ర సంస్థలను ఏకం చేసి టీఆర్ఎఫ్ను ఏర్పాటు చేశారు. దీంతో భారత్లోని ఉగ్రవాదంతో తమకు జోక్యం లేదని పాక్ చెప్పుకోవడానికి అవకాశం లభించింది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పాక్ ఎలాగైనా ఎఫ్ఏటీఎఫ్ ఆంక్షల నుంచి బయటపడాలని చూస్తోంది. భారత్లో ఉగ్రవాదానికి పాక్ సంబంధం లేదని చెప్పుకొనేందుకు టీఆర్ఎఫ్ను సృష్టించింది. దీన్ని అడ్డం పెట్టుకొని ఎఫ్ఏటీఎఫ్ ఆంక్షల నుంచి బయటపడాలని భావిస్తోంది.
ఛోటా వలీద్ పేరు బయటకు..
ఛోటా వలీద్ అనే ఉగ్రవాది 20 రోజుల క్రితం భారత్లో అడుగు పెట్టాకే ఈ దాడులు పెరిగాయని తాజాగా కశ్మీర్లో భద్రతా దళాలు గుర్తించాయి. మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడుల్లో ఇతడి హస్తం ఉందని చెబుతున్నాయి. ఈ దాడులను స్థానిక ఉగ్రవాదులే చేసినా.. వీటి వెనుక వ్యూహం వలీద్దే అన్న అనుమానాలు ఉన్నాయి. పలు ఫోన్ కాల్స్ను అధికారులు గుర్తించాక ఇతని పాత్రపై ఓ అభిప్రాయానికి వచ్చారు. అతడే స్థానిక ఉగ్రవాదులకు ఫోన్లు చేసి దాడులు చేయాలని ప్రోత్సహిస్తున్నట్లు తేలింది. ఇతను రెసిస్టెన్స్ ఫ్రంట్ తరపున పని చేస్తున్నాడా..? మరేదైనా గ్రూపు తరపున చేస్తున్నాడో భద్రతా దళాల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్