
Marriage Age: లోక్సభ ముందుకు ‘యువతుల పెళ్లి వయసు పెంపు’ బిల్లు
ఆందోళనల మధ్యే బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి
దిల్లీ: దేశంలో యువతుల కనీస పెళ్లి వయసును 18ఏళ్ల నుంచి 21ఏళ్లకు పెంచే దిశగా బాల్య వివాహాల నియంత్రణ సవరణ బిల్లు - 2021ని కేంద్ర ప్రభుత్వం నేడు లోక్సభ ముందుకు తీసుకొచ్చింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ వారి ఆందోళనల నడుమే కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే విపక్షాలు అభ్యంతరాలు చెప్పడంతో స్థాయీ సంఘానికి పంపిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. కానీ వివాహాబంధంలోకి అడుగుపెట్టే విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలకు 75ఏళ్లు ఆలస్యంగా సమానహక్కులు కల్పిస్తున్నాం. ఈ సవరణతో ఇకపై యువతీయువకులు 21ఏళ్ల వయసులో పెళ్లిపై నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుంది. మహిళా సమానత్వాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లును తీసుకొచ్చాం’’ అని తెలిపారు.
అయితే ఈ బిల్లుపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎవరినీ సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా ఈ బిల్లు తీసుకొచ్చిందని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీ లేదా సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిన అవసరం ఉందని, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే బిల్లును ప్రవేశపెట్టాలని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు.
మరోవైపు మజ్లిస్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఈ బిల్లు .. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం యువతుల స్వేచ్ఛాయుత హక్కుకు వ్యతిరేకమని విమర్శించారు. 18ఏళ్ల అమ్మాయిలు ప్రధానమంత్రిని ఎన్నుకున్నప్పుడు, సహ జీవనం చేస్తున్నప్పుడు అదే వయసు యువతుల వివాహ హక్కును ఎందుకు తిరస్కరిస్తున్నారని ప్రశ్నించారు. విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తామని కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత లఖింపుర్ ఖేరీ ఘటనతో పాటు పలు అంశాలపై ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
-
World News
Pakistan: పాక్లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి
-
India News
Kerala: సీఎం పినరయ్ విజయన్ను తుపాకీతో కాలుస్తా: మాజీ ఎమ్మెల్యే భార్య హెచ్చరిక
-
Crime News
దారుణం.. మైనర్లయిన అక్కాచెల్లెలిపై గ్యాంగ్ రేప్: ఐదుగురు యువకులు అరెస్టు!
-
Sports News
Virat Kohli: బెయిర్స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
-
Business News
Maruti Alto K10: మళ్లీ రానున్న మారుతీ ఆల్టో కే10?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్స్టోక్స్ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Virat Kohli: బెయిర్స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
- Viral tweet: ‘క్యాబ్లో నేను ఇంటికి వెళ్లే ఖర్చుతో విమానంలో గోవా వెళ్లొచ్చు!’
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్
- Anand Mahindra: హర్ష గొయెంకా ‘గ్రేట్ మెసేజ్’కు.. ఆనంద్ మహీంద్రా రియాక్ట్!
- Social Look: ఆహారం కోసం ప్రియాంక ఎదురుచూపులు.. రకుల్ప్రీత్ హాట్ స్టిల్!
- Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
- IndiGo: ఒకేరోజు వందల మంది ఉద్యోగులు ‘సిక్లీవ్’..! 900 సర్వీసులు ఆలస్యం