UN WFP: ‘ఆకలి అంచుల్లో 4.20 కోట్ల మంది.. ఎలాన్ మస్క్ లాంటివాళ్లు ముందుకురావాలి’
దుర్భిక్ష ప్రాంతవాసుల ఆకలి సమస్య తీర్చేందుకు బిలియనీర్లు వన్ టైం ప్రాతిపదికన ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్పీ) డైరెక్టర్ డేవిడ్ బీస్లీ ఆకాంక్షించారు. తాజాగా ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆకలిపై పోరాటానికి...
న్యూయార్క్: దుర్భిక్ష పరిస్థితుల్లో జీవనం వెళ్లదీస్తున్నవారి ఆకలి బాధలను తీర్చేందుకు బిలియనీర్లు వన్ టైం ప్రాతిపదికన ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్పీ) డైరెక్టర్ డేవిడ్ బీస్లీ పిలుపునిచ్చారు. తాజాగా ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆకలిపై పోరాటానికి సంపన్నవర్గాల తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. ప్రత్యేకంగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ల పేర్లను ప్రస్తావిస్తూ.. వారు తమ సంపదలో స్వల్ప మొత్తాన్ని ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కారానికి పాటుపడినవారవుతారని చెప్పారు. వాతావరణ మార్పులు, కొవిడ్ మహమ్మారి తదితర సంక్షోభాల కారణంగా చాలా దేశాలు కరవు ముంగిట ఉన్నాయని డబ్ల్యూఎఫ్పీ డైరెక్టర్ వివరించారు.
6 బిలియన్ డాలర్లు కావాలి..
అఫ్గాన్ వంటి దేశాలు తీవ్రమైన ఆకలి, నిరుద్యోగం, ఆర్థిక మందగమనం కారణంగా సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నాయని.. గ్వాటెమాల, హోండురాస్, నికరాగ్వా తదితర దేశాలు తుపానులు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమయ్యాయని బీస్లీ చెప్పారు. తక్షణమే ఆదుకోని పక్షంలో దాదాపు 4.20 కోట్ల మంది చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారికి సహాయం చేసేందుకు 6 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని చెప్పారు. మస్క్ నికర సంపదలో ఇది స్వల్ప మొత్తమేనని ఆయన పేర్కొన్నారు. ఆయా నివేదికల ప్రకారం.. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా బిలియనీర్ల నికర ఆదాయం పెరుగుతూ వచ్చింది! ఇటీవల ఒక్కరోజే మస్క్ ఏకంగా రూ.2.71 లక్షల కోట్లు సంపాదించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..