Rakesh Tikait: ‘భాజపా, ఆరెస్సెస్లతో జాగ్రత్త.. ఎంతకైనా తెగిస్తాయి’
దేశ ప్రజలను విడగొట్టేందుకు భాజపా, ఆరెస్సెస్లు ఎంత దూరమైనా వెళ్తాయని రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ ఆరోపించారు.....
దిల్లీ: దేశ ప్రజలను విడగొట్టేందుకు భాజపా, ఆరెస్సెస్లు ఎంత దూరమైనా వెళ్తాయని రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. వాటితో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలను, వారి మధ్య ఐక్యతను విడదీసేందుకు భాజపా, ఆరెస్సెస్ ఎంతకైనా తెగిస్తాయని వ్యాఖానించారు. సాగు చట్టాల విషయంపై రైతులతో చర్చలు జరపాలని కేంద్రానికి సూచించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో టికాయిత్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం చర్చలకు ఆహ్వానిస్తే మంచిదని.. లేదంటే నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు.
‘ప్రభుత్వం మాతో ఎందుకు చర్చలు జరపడం లేదు? దాదాపు ఏడాది కావొస్తోంది. ఇంత సుదీర్ఘంగా ఏ నిరసనలైనా జరగడం చూశారా? ఈ ఉద్యమాన్ని ఎంత దూరం తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది? చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. మాతో మాట్లాడండి. ఓ నిర్ణయానికి రండి’ అని రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. నిరసనలు కొనసాగించేందుకు మరిన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. శీతాకాలం వచ్చేసింది కాబట్టి చలిని తట్టుకునేలా దుస్తులు తెచ్చుకోవాలని రైతులను కోరుతామని పేర్కొన్నారు. హరియాణాలోని హిసార్ జిల్లాలో భాజపా ఎంపీ రామ్ చందర్ జాంగ్రా కారుపై దాడి ఘటనపైనా టికాయిత్ మాట్లాడారు. కొందరు ప్రైవేటు గూండాలు రైతుల్లో కలిసిపోయారని ఆరోపించారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇలాంటివారు రైతుల్లో కలిసిపోయి దాడులకు తెగబడుతున్నారని పేర్కొన్నారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఎంపీ రామ్ చందర్ జాంగ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనిలేని తాగుబోతులే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంపీ వ్యాఖ్యలపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శుక్రవారం హిసార్ జిల్లా నర్నౌంద్లో కొందరు జాంగ్రా కారును అడ్డగించి వాహనాన్ని ధ్వంసం చేశారు. రైతులే ఈ దాడి చేశారని.. తనపై హత్యాయత్నం జరిగిందని ఎంపీ ఆరోపించారు. జాంగ్రా వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు నినదిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!