Fuel price: పెట్రో ధరలు తగ్గించండి.. లేకపోతే..!: స్టాలిన్ సర్కార్కు భాజపా హెచ్చరిక
ఇంధన ధరలు తగ్గించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నమలై తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ........
చెన్నై: ఇంధన ధరలు తగ్గించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నమలై తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని గౌరవించి లీటరు పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.4ల చొప్పున తగ్గించాలన్నారు. అలాగే, ఎల్పీజీ ధరలను సైతం తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపడతానని హెచ్చరించారు. ప్రభుత్వం తన ఎన్నికల హామీని నెరవేర్చడంలో విఫలమైతే తిరుచిరాపల్లిలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు హెచ్చరించారు. పెట్రోల్ ధరలు తగ్గించాలన్న డిమాండ్పై చెన్నైలోని రాజారత్నం స్టేడియం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టేందుకు ప్లాన్ చేయగా.. పోలీసులు అటువైపు వెళ్లకుండా బారికేడ్లు వేసి అడ్డుకున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో డీఎంకే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీఎం స్టాలిన్ను కోరుతున్నామన్నారు.
మరోవైపు, ఇదే అంశంపై అన్నమలై ట్వీట్ చేశారు. ఈ విషయంలో తమ సహనం నశించిపోయిందని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీని పెడచెవిన పెడుతున్న ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన సమయమిదేనన్నారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ శ్రేణులు, చెన్నై ప్రజలు నిరసన ర్యాలీ చేపట్టారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ లీటరు పెట్రోల్పై రూ.14.5, డీజిల్పై రూ.17 తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన ప్రజా వ్యతిరేక విధానాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు. దీనికి నిరసనగా భాజపా శ్రేణులు అన్ని జిల్లాల్లో ఒకరోజు సత్యాగ్రహం నిర్వహించాలని పిలుపునిచ్చారు. సత్యాగ్రహం అనంతరం తిరుచిరాపల్లిలో భారీ నిరసన చేపడతామన్నారు. ఈ నిరసన కార్యక్రమం కచ్చితంగా తమిళనాడులో డీఎంకే ప్రభుత్వ పాలన అంతానికి నాంది పలుకుతుందని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!