‘థ్యాంక్స్ కేజ్రీజీ.. నా కలను నిజం చేశారు’.. దిల్లీ వీధుల్లో భాజపా నేత పడవపై విహారం
దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. శనివారం కురిసిన భారీ వర్షానికి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో భాజపాకు నేత ఒకరు దిల్లీ నడి వీధుల్లో ర్యాఫ్టింగ్ చేస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. శనివారం కురిసిన భారీ వర్షానికి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో భాజపాకు నేత ఒకరు దిల్లీ నడి వీధుల్లో వర్షపు నీటిలో బోటులో తిరుగుతూ కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తన కలను నెరవేర్చారంటూ దెప్పిపొడిచారు. వర్షం నీటిలో షికారు చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది.
భారతీయ జనతా యువ మోర్చాకు చెందిన తజీందర్ పాల్ సింగ్ బగ్గా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ తనదైన శైలిలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘ఈ సీజన్లో పడవ విహారం కోసం రిషికేష్ వెళ్దామనుకున్నా. కరోనా కారణంగా లాక్డౌన్ పెట్టడంతో అది వీలు కాలేదు. కానీ, నా కలను నిజం చేస్తూ దిల్లీలోనే ఆ ఏర్పాట్లు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ధన్యావాదాలు చెబుతున్నా’’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు బగ్గా. ఈ ఘనతను చాటుకుంటూ దిల్లీ నలుమూలాల బోర్డులు పెట్టుకోండి అంటూ వ్యంగ్యంగా అన్నారు.
మరోవైపు ఎప్పుడూలేని రీతిలో దిల్లీని ఈ ఏడాది వర్షాలు ముంచెత్తాయి. దీంతో నగరంలో చాలా చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్ నెలలోనే 383 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 1944లో 417.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. మళ్లీ ఆ స్థాయిలో ఈ ఏడాదే వర్షం కురియడం గమనార్హం. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో సైతం ఇదే స్థాయిలో దిల్లీలో వర్షం కురిసిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్