Rahul Gandhi: దిల్లీలో భాజపా ఓబీసీ ఎంపీల నిరసన

రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు భాజపా ఓబీసీ ఎంపీలు మండిపడ్డారు. ఆయన క్షమాపణలు అడగాలని పార్లమెంట్‌ ఎదుట నిరసన చేపట్టారు. 

Published : 28 Mar 2023 19:48 IST

దిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా భాజపా ఓబీసీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం ఎదుట మంగళవారం నిరసలు చేపట్టారు. మోదీ ఇంటి పేరును కించపరిచి ఓబీసీలను అవమానించారంటూ ఆయనపై మండిపడ్డారు.  రాహుల్‌ తప్పుగా వ్యాఖ్యానించినందుకు ఆయన క్షమాపణలు  చెప్పాలని డిమాండ్‌  చేశారు.

  నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీలను ఉద్దేశించి మోదీ ఇంటిపేరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.  ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను నమోదైన పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు గత వారంలో కాంగ్రెస్‌ నేతకు రెండేళ్ల జైలు శిక్షను  విధించింది. ఈ తీర్పుతో వయనాడ్‌కు ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం రద్దు చేసిన విషయం తెలిసిందే. 


 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని