Chandigarh: చండీగఢ్కు అమిత్ షా ‘గుడ్న్యూస్’.. భాజపా భయపడుతోందన్న ఆప్..!
పంజాబ్ రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్లో వరాలు కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు ‘గుడ్ న్యూస్’ అంటూ ప్రకటించారు.
దిల్లీ: పంజాబ్ రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్లో వరాలు కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు ‘గుడ్ న్యూస్’ అంటూ ప్రకటించారు. అయితే ఇది కాస్తా రాజకీయ దుమారానికి దారి తీసింది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. తమను చూసి భాజపా భయపడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
చండీగఢ్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వెళ్లిన అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ‘‘చండీగఢ్ పరిపాలన విభాగంలో పనిచేస్తోన్న ఉద్యోగులకు తీపి కబురు చెబుతున్నా. చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు కేంద్ర సివిల్ సర్వీసులకు అనుగుణంగా ఉంటాయి. ఈ నిర్ణయంతో మీరు భారీగా ప్రయోజనాలు పొందుతారు. అంతేగాక, మహిళా ఉద్యోగులు తమ పిల్లల సంరక్షణ కోసం ప్రస్తుతమున్న ఏడాది సెలవులు కూడా రెట్టింపవుతాయి’’ అని షా వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ నిర్ణయంతో చండీగఢ్లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 60కి పెరగనుంది. దీంతో పాటు మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి.
అయితే ఈ ప్రకటన రాజకీయ వివాదానికి తెర లేపింది. ‘‘చండీగఢ్ పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని. తాత్కాలికంగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల్లో 60 శాతం పంజాబ్ నుంచి మిగతా వారు హరియాణా నుంచి ఉన్నారు. పునర్వ్యవస్థీకరణ సమయంలో ఇక్కడ ఉద్యోగులకు పంజాబ్ ప్రభుత్వ నిబంధనలే అమలు చేయాలని ఒప్పందం చేశారు. కానీ ఈ రోజు కేంద్రం నియంతృత్వ ధోరణిలో వ్యవహరించింది. పంజాబ్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని శిరోమణి అకాలీదళ్ సీనియర్ నేత దల్జిత్ సింగ్ ఆరోపించారు. ఇతర రాజకీయ పార్టీలు కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించాయి.
భాజపాకు భయం పట్టుకుంది..
మరోవైపు పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. భాజపాపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆప్ను చూసి భాజపా భయపడుతోందని, అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆ పార్టీ సీనియన్ నేత, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఎద్దేవా చేశారు. ‘‘2017 నుంచి 2022 వరకు పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు చండీగఢ్పై అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే ఇలాంటి ప్రకటన చేశారు. ఆప్ విస్తరణ చూసి భాజపా భయపడుతోంది’’ అని సిసోడియా దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్