BJP: భుట్టో... ఖబడ్దార్! దేశవ్యాప్త నిరసనలకు భాజపా పిలుపు
ప్రధాని మోదీ(PM Modi)పై పాక్ విదేశాంగ మంత్రి బిలావుల్ భుట్టో చేసిన వ్యాఖ్యల్ని భాజపా తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యల్ని నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఆయా రాష్ట్రాల రాజధాని నగరాల్లో పాక్, పాక్ మంత్రి దిష్టిబొమ్మలు దహనం చేయనున్నారు.
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)పై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావుల్ భుట్టో(Bilawal Bhutto) వ్యక్తిగతంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ(BJP) తీవ్రస్థాయిలో స్పందించింది. పాక్ మంత్రి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన భాజపా నేతలు.. దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. పాక్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు భుట్టో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పాక్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యల్ని నిరసిస్తూ శనివారం దేశవ్యాప్తంగా నిరసనలకు భాజపా పిలుపునిచ్చింది. భుట్టో వ్యాఖ్యలు సిగ్గుచేటని.. ఆయన వ్యాఖ్యల్నినిరసిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో పాకిస్థాన్, పాక్ మంత్రి భుట్టో దిష్టిబొమ్మల్ని శనివారం తగలబెట్టనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, అక్కడ అన్యాయం, అరాచకాలు రాజ్యమేలడం, సైన్యంలో విభేదాలు, ప్రపంచంతో సంబంధాలు క్షీణిస్తుండటం, ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండటం వల్ల వాటి నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ భాజపా మండిపడింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం సందర్భంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులతో పాటు కొందరు పాక్ విద్యార్థుల్ని సైతం మోదీ సర్కార్ కాపాడిన విషయాన్ని ఈ సందర్భంగా భాజపా గుర్తు చేసింది. ఆ మిషన్కు ప్రధాని మోదీనే సారథ్యం వహించారని తెలిపింది. అలాంటి ప్రధాని మోదీ పట్ల మంత్రి భుట్టో ఉపయోగించిన భాష తీవ్ర గర్హనీయమని తెలిపింది. అతడు వాడిన భాష రాజనీతిజ్ఞత స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని.. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి అన్ని హద్దులు మీరి మాట్లాడారని మండిపడింది. అసలు గ్లోబల్ లీడర్గా ఉన్న మోదీ గురించి వ్యాఖ్యానించే స్థాయి ఆయనకు ఉందా అని ప్రశ్నించింది. భుట్టో చేసిన వ్యాఖ్యలతో ఆ దేశ ప్రతిష్ఠ మరింత దిగజారిందని పేర్కొంది.
పాకిస్థాన్.. నీ తీరు మార్చుకో: విదేశాంగ శాఖ
పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో (Bilawal Bhutto) చేసిన వ్యాఖ్యలు అనాగరికమని కేంద్ర విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. పాకిస్థాన్వి దిగజారిన వ్యాఖ్యలని మండిపడ్డ భారత్.. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను గుర్తించలేని అసమర్థత ఆయన వ్యాఖ్యల్లో స్పష్టమవుతోందని విమర్శించింది. ఉగ్రవాదంపై పాకిస్థాన్ తమ చేష్టలను ఇకనైనా మార్చుకుని, పొరుగు దేశాల పట్ల స్నేహంగా ఉండాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హితవు పలకడంపై స్పందిస్తూ పాక్ విదేశాంగశాఖ మంత్రి ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై భారత్ తీవ్రంగా స్పందించింది.
‘పాకిస్థాన్ (Pakistan) మంత్రి 1971లో ఈ రోజును మర్చిపోయారు. బెంగాలీలు, హిందువుల పట్ల పాకిస్థాన్ పాలకుల మారణహోమానికి ఇది ప్రత్యక్ష ఫలితం. దురదృష్టవశాత్తు.. పాక్ తన మైనారిటీల పట్ల వ్యవహరించే విషయంలో పెద్దగా మారినట్లు కనిపించడం లేదు. ఇప్పుడు ప్రధాన అంతర్జాతీయ అజెండా ఉగ్రవాద నిరోధక చర్యలే. కానీ, ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించడం, ఆర్థిక సాయం అందించడంలో పాక్ తిరుగులేని పాత్ర. న్యూయార్క్, ముంబయి, పుల్వామా, పఠాన్కోట్, లండన్ ఇలా ఎన్నో నగరాలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద మచ్చలు కలిగి ఉన్నాయి. ఈ హింస.. పాక్ ప్రత్యేక ఉగ్రవాద జోన్ల నుంచి పుట్టుకొచ్చింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు పాకింది. ‘మేక్ ఇన్ పాకిస్థాన్’ ఉగ్రవాదాన్ని అరికట్టాల్సి ఉంది’ అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ (Arindam Bagchi) ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
‘ఒసామా బిన్ లాడెన్(Osama bin Laden)ను అమరవీరుడని కీర్తిస్తూ.. లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజార్, సాజిద్ మీర్, దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశం పాకిస్థాన్. ఐరాస ప్రకటిత 126 మంది ఉగ్రవాదులు, 27 ఉగ్రవాద సంస్థలను కలిగి ఉన్నామని మరే ఇతర దేశం గొప్పగా చెప్పుకోదు! పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ బుల్లెట్ల నుంచి 20 మంది గర్భిణులను కాపాడిన ముంబయి నర్సు అంజలి కుల్తే సాక్ష్యాన్ని ఐరాస భద్రతా మండలిలో పాక్ మంత్రి విని ఉండాల్సింది. కానీ, తన దేశ పాత్రను మాయం చేసేందుకు ఆయన ఎక్కువ ఆసక్తి చూపారు. ఉగ్రవాదాన్ని తమ దేశ విధానంలో భాగంగా మార్చుకున్న పాక్ మంత్రి.. తన దేశ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి’ అని బాగ్చి విమర్శలు గుప్పించారు.
భుట్టో వ్యాఖ్యలపై మంత్రుల ఫైర్!
ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ పాక్ విదేశాంగ మంత్రి భుట్టో చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. 1971లో భారత సైన్యం చేతిలో పాకిస్థాన్ ఓడిపోయినందుకు ఇంకా అతడు బాధలోనే ఉన్నాడేమో అంటూ చురకలంటించారు. చాలాకాలంగా ఉగ్రవాదులకు ఆశ్రయంకల్పిస్తున్నారంటూ మండిపడ్డారు. పాకిస్థాన్ చర్యలను, ఉద్దేశాలను యావత్ ప్రపంచం గమనిస్తోందన్నారు. పాకిస్థాన్ చాలాకాలంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పారు. ఒసామా బిన్లాడెన్ను అమెరికా పాకిస్థాన్లోనే మట్టుబెట్టిందని.. అలాగే, పాకిస్థాన్లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని గుర్తు చేశారు. మరోవైపు, పాక్మంత్రి వ్యాఖ్యల్ని కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి మీనాక్షి లేఖి తీవ్రంగా ఖండించారు.ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారంటూ మండిపడ్డారు.ఒక దేశ విదేశాంగ మంత్రి ఇలాంటివ్యాఖ్యలు చేయడం తగదని.. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ పాకిస్థాన్ ఎఫ్ఏటీఎఫ్ గ్రేలిస్ట్లో అనేక ఏళ్లుగా కొనసాగుతూ వచ్చిందని విమర్శలు గుప్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి