Mehbooba Mufti: ఓట్ల కోసమే అఫ్గాన్, తాలిబన్ల ప్రస్తావన.. భాజపాపై మెహబూబా ముఫ్తీ ఆరోపణలు
ఉత్తర్ప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నందున ఓట్ల కోసం.. తాలిబన్లు, అఫ్గానిస్థాన్ తదితర అంశాలపై భాజపా రాజకీయాలు చేస్తోందని పీడీపీ అధ్యక్షురాలు, జమ్మూ- కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు...
శ్రీనగర్: ఉత్తర్ప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నందున ఓట్ల కోసం.. తాలిబన్లు, అఫ్గానిస్థాన్ తదితర అంశాలపై భాజపా రాజకీయాలు చేస్తోందని పీడీపీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఒకవేళ ఈ అంశాలు పనిచేయడం లేదని భావిస్తే.. పాకిస్థాన్, డ్రోన్లు, జమ్మూ కశ్మీర్ను తెరపైకి తీసుకొస్తుందన్నారు. లద్ధాఖ్లో చైనా దురాక్రమణపై మాత్రం మాట్లాడదని.. ఎందుకంటే ఈ అంశం ఓట్లు తెచ్చిపెట్టదు కదా ఎద్దేవా చేశారు. పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జమ్మూలో నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. భాజపా పాలనలో ప్రజాస్వామ్యం, దేశం ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన మంచినంతా పోగొట్టారని ధ్వజమెత్తారు.
సోనూసూద్ లాంటివారికీ తప్పడం లేదు..
భాజపా ఏడేళ్ల పాలన ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టిందని, ముఖ్యంగా జమ్మూ- కశ్మీర్ను నాశనం చేసిందని ముఫ్తీ విమర్శించారు. ప్రభుత్వ సంస్థల విక్రయంతోపాటు ఇంధన ధరలు, నిత్యావసరాల ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఖజానా నింపుకొంటోందని ఆరోపించారు. ఆ నగదుతో ప్రతిపక్ష నేతలను కొనడం, వినకపోతే.. వారిని బెదిరించేందుకు ప్రభుత్వ సంస్థలను ఉపయోగిస్తోందన్నారు. కశ్మీర్ పౌరులకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కల్పించడం లేదని, దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి ఉందని.. సోనూసూద్ లాంటివారూ ఈడీ దాడులు ఎదుర్కొంటున్నారన్నారు. ‘నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. కానీ, నేను దానికి స్వయం పాలన అని పేరు పెడితే.. దేశ ద్రోహిగా ముద్ర వేస్తార’ని పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో భాజపా అధికారంలో ఉండుంటే జమ్మూకశ్మీర్ ఎన్నడూ భారత్లో చేరేదే కాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)