ఈశాన్యంలో మళ్లీ కాషాయ రెపరెపలే
తేయాకు తోటలు, ఇంధన వనరులకు నిలయంగా పేరున్న ఈశాన్య రాష్ట్రం అస్సాంలో మరోసారి కాషాయ జెండా రెపరెపలాడింది. వరుసగా రెండోసారి విజయం సాధించిన తొలి కాంగ్రెసేతర పార్టీగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మరింత
తేయాకు తోటలు, ఇంధన వనరులకు నిలయంగా పేరున్న ఈశాన్య రాష్ట్రం అస్సాంలో మరోసారి కాషాయ జెండా రెపరెపలాడింది. వరుసగా రెండోసారి విజయం సాధించిన తొలి కాంగ్రెసేతర పార్టీగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఈశాన్యంపై తమ పట్టును ఘనంగా చాటుకుంది. పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ ప్రధాని మోదీ చరిష్మా.. స్థానిక నాయకుల ప్రాబల్యం మరోసారి కమలనాథులను అధికార పీఠంపై కూర్చోబెట్టాయి.
ఐదేళ్ల క్రితం 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా జయకేతనం ఎగురవేసి సరికొత్త చరిత్ర లిఖించింది. ఈ రాష్ట్రంలో తొలిసారి అధికారాన్ని దక్కించుకుంది. మొత్తం 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో ఆ ఎన్నికల్లో భాజపా 60 చోట్ల విజయం సాధించింది. అప్పటివరకు ఈ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ కేవలం 26 చోట్ల మాత్రమే నెగ్గింది. మెజార్టీ మార్క్ రాకపోవడంతో అస్సాం గణపరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్)తో కలిసి కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏడాది ఎన్నికల ముందు ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతూ బీపీఎఫ్ పార్టీ.. భాజపాకు షాకిచ్చింది. బోడోలాండ్ ప్రాంతంలో ఈ పార్టీకి రెండు దశాబ్దాలుగా గట్టి పట్టుంది. ఎన్డీయేను వీడిన బీపీఎఫ్.. కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమెక్రాటిక్ ఫ్రంట్తో కలిసి మహాజోత్(మహాకూటమి)గా ఏర్పడింది.
ప్రత్యర్థుల బలహీనతలే అస్త్రాలు..
బీపీఎఫ్.. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం బోడోలాండ్ ప్రాంతంలో భాజపాకు సవాల్గా మారింది. దీంతో కాషాయ పార్టీ హిమంత బిశ్వ శర్మను రంగంలోకి దించింది. బోడో వర్గంలో పట్టున్న మరో ప్రాంతీయ పార్టీ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్(యూపీపీఎల్)తో హిమంతకు స్నేహంతో ఆ పార్టీని కూటమిలో చేర్చుకుంది. అది భాజపాకు కలిసొచ్చింది. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పోరాటమే లక్ష్యంగా పుట్టుకొచ్చిన అసోం జాతీయ పరిషత్, రైజోర్ దళ్ కూడా ఎన్నికల బరిలోకి దిగాయి. దీంతో అటువైపు నుంచి కూడా భాజపాకు పోటీ మొదలైంది.
అయితే కాషాయ పార్టీ మాత్రం తమ వ్యూహాలపై బలంగా ఉంది. సీఏఏ అమలుపై ఓ వైపు పట్టుదలగా ఉంటూనే.. హిందూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్.. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్తో పొత్తు పెట్టుకోవడాన్ని తమ అస్త్రంగా మలుచుకుని ప్రచారం సాగించింది. ఆ దిశగా ముస్లిం ఓటర్లపైనా ప్రభావం చూపించే ప్రయత్నం చేసింది. ఈ ప్రచారం సీఏఏ, ఎన్నార్సీ అంశాలను వెనక్కి నెట్టేలా చేసింది. ఫలితంగా రెండో పర్యాయం కాషాయ పార్టీకి సునాయస విజయాన్ని అందించేలా చేసింది. దీనికి తోడు కేంద్ర పరిధిలో అస్సాంకు భాజపా ఇతర ప్రధాన రాష్ట్రాలతో సమానంగా ప్రాధాన్యమివ్వడం కూడా ఆ పార్టీకి అదనపు బలంగా మారింది.
హస్తానికి కలిసిరాని పొత్తులు..
ఏళ్ల తరబడి అస్సాంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు మరోసారి రిక్తహస్తమే ఎదురైంది. ఈసారి కూడా ఆ పార్టీకి పొత్తులు కలిసిరాలేదు. ముస్లిం వర్గాల మద్దతు ఉన్నప్పటికీ దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడంలో హస్తం మళ్లీ విఫలమైంది. అంతేగాక, కూటమిని ముందుండి నడిపించే నాయకులు లేకపోవడం, తరుణ్ గొగొయ్ లాంటి దిగ్గజ నేతల లోటు ఆ పార్టీలో స్పష్టంగా కన్పించింది.
ముఖ్యమంత్రి ఎవరో..
ఎప్పటిలాగే అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే భాజపా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. దీంతో సీఎం ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి శర్వానంద సోనోవల్ను మరోసారి కొనసాగించే అవకాశాలు తక్కువగా కన్పిస్తున్నాయి. ఈ రేసులో కీలక నేత, రాష్ట్ర మంత్రి పేరు హిమంత విశ్వశర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మరి అస్సాం పగ్గాలను భాజపా ఎవరికి అప్పగిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్