BJYM: 42 మందితో బీజేవైఎం జాతీయ కార్యనిర్వాహక కమిటీ.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి చోటు

భాజపా యువమోర్చా జాతీయ కార్యనిర్వాహక కమిటీని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మొత్తంగా 42మందితో జాబితాను విడుదల చేసింది.......

Published : 23 Aug 2021 15:55 IST

దిల్లీ: భాజపా యువమోర్చా (బీజేవైఎం) కొత్త జాతీయ కార్యనిర్వాహక కమిటీ ఎన్నికైంది. మొత్తం 42మంది సభ్యులతో భాజపా జాబితాను విడుదల చేసింది. దీంట్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. ఏపీ నుంచి వంశీ యాదవ్‌, తెలంగాణ నుంచి డా. బి.శ్రీనివాస్ సోలంకి ఉన్నారు. ఈ కమిటీని భాజపా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య సోమవారం తన ట్విటర్‌లో ప్రకటించారు. కొత్త సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. భారతమాతకు సేవచేసేందుకు, వినూత్న భారతదేశాన్ని నిర్మాణంలో భాగస్వామ్యానికి ఇదో గొప్ప అవకాశమని పేర్కొన్నారు. బీజేవైఎంను మరింత బలోపేతం చేసేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని