Black Fungus: పేగుల్లో బ్లాక్ ఫంగస్
ఇద్దరు బాధితుల పేగుల్లో మ్యుకర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్)ను గుర్తించినట్లు దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న ఇద్దరి చిన్న పేగుల్లో ఈ ఫంగస్ను గుర్తించినట్లు....
దిల్లీ ఆసుపత్రిలో ఇద్దరు రోగుల్లో గుర్తింపు
దిల్లీ: ఇద్దరు బాధితుల పేగుల్లో మ్యుకర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్)ను గుర్తించినట్లు దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న ఇద్దరి చిన్న పేగుల్లో ఈ ఫంగస్ను గుర్తించినట్లు సర్ గంగారామ్ ఆసుపత్రి శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు ముక్కు, సైనస్ ప్రాంతాల్లోనే బ్లాక్ ఫంగస్ను గుర్తించామని.. కానీ తాజాగా ఇద్దరిలో పేగుల్లో వైద్యులు ఈ ఫంగస్ను గుర్తించినట్లు వెల్లడించింది. వారిద్దరికి మధుమేహం ఉందని, వారు కొవిడ్ నుంచి కోలుకున్నారని.. అందులో ఓ వ్యక్తి స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు పేర్కొంది.
‘ఇద్దరిలో ఓ వ్యక్తి (56).. కరోనాతో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయాడు. వైరస్ నుంచి కోలుకున్నాక కడుపు నొప్పితో బాధపడ్డాడు. అయితే అతడికి సిటీ స్కాన్ నిర్వహించిన వైద్యులు చిన్న పేగులో మ్యుకర్మైకోసిస్ను గుర్తించారు. ఫంగస్తో చిన్న పేగు చిల్లులు పడినట్లు గుర్తించారు. దీంతో అతడికి శస్త్ర చికిత్స నిర్వహించాలని నిర్ణయించుకున్నాం’ అని ఆ ప్రకటనలో తెలిపింది. రెండో రోగి (68) కూడా కడుపు నొప్పితో బాధపడ్డాడని, అయితే అతడు స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు వెల్లడించింది. అతడికి కూడా శస్త్రచికిత్స చేసినట్లు వివరించింది.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మే21 నాటికి దేశవ్యాప్తంగా 8,848 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో అత్యధికంగా 2,281 మందికి ఈ వ్యాధి సోకగా.. మహారాష్ట్రలో 2,000, ఆంధ్రప్రదేశ్లో 910 మంది ఈ ఫంగస్ బారిన పడ్డారు. పలు రాష్ట్రాల్లో వెలుగుచూస్తోన్న బ్లాక్ ఫంగస్ కేసుల ఆధారంగా ఆంఫోటెరిసిన్-బి ఔషధాన్ని కేటాయించామని కేంద్ర మంత్రి సదానంద గౌడ శనివారం వెల్లడించారు. ఇదేమీ కొత్త వ్యాధి కాకపోయినా.. దీని బారినపడిన వారి పరిస్థితి కొద్ది రోజుల్లోనే విషమిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.