Modi: నీరు, నెత్తురు కలిసి ప్రవహించలేవు: ‘సింధూ జలాల’పై ఆనాడే హెచ్చరించిన మోదీ
సింధూ జలాల ఒప్పందాన్ని (Indus water treaty) సవరించుకోవడంపై భారత్ ఆరేళ్ల కిందటే పునరాలోచన చేసినట్లు తాజాగా తెలిసింది. 2016లో ఉరి ఉగ్రదాడి ఘటన తర్వాత మోదీ దీని గురించి అధికారులను హెచ్చరించారట..!
ఇంటర్నెట్ డెస్క్: భారత్ (India), పాకిస్థాన్ మధ్య ఆరు దశాబ్దాలుగా ఉన్న ‘సింధూ జలాల ఒప్పందాన్ని (ఐడబ్ల్యూటీ)’ మార్చేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పాక్కు నోటీసు కూడా జారీ చేసింది. అయితే ఈ ఒప్పందాన్ని (Indus water treaty) సవరించాలన్న నిర్ణయం ఈ నాటిది కాదు. 2016లోనే మోదీ సర్కారు దీనిపై పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. ఉరిలోని సైనిక క్యాంప్పై ఉగ్రదాడి తర్వాత సింధూ జలాల ఒప్పంద సమీక్షలో భారత ప్రధాని మోదీ (Modi) మాట్లాడుతూ.. ‘‘నీరు, నెత్తురు కలిసి ప్రవహించలేవు’ అని అధికారులతో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నాటి హెచ్చరికలే ఇప్పుడు ప్రతిధ్వనిస్తున్నట్లు తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది.
2016 సెప్టెంబరులో జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని ఉరి సైనిక స్థావరంపై పాక్ (Pakistan) కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 18 మంది ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన జరిగిన సరిగ్గా 11 రోజుల తర్వాత సింధూ జలాల ఒప్పందంపై కమిషనర్లు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలోనే ప్రధాని మోదీ అధికారులతో మాట్లాడుతూ ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నెత్తుటి చర్యలకు పాల్పడుతున్న దాయాదితో నీటిపై ఒప్పందం కొనసాగించలేమని ప్రధాని ఆనాడు సూచనప్రాయంగా వెల్లడించారు. తాజాగా ఐడబ్ల్యూటీ ఒప్పంద సవరణకు భారత్.. పాక్కు నోటీసులిచ్చిన వేళ నాటి మోదీ వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
ఉరి (Uri) ఘటన జరిగిన రెండేళ్లకు 2018 మే నెలలో ప్రధాని మోదీ బాందిపొరాలో కిషన్గంగా ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. దీంతో పాటు జమ్మూకశ్మీర్లో 1000 మెగావాట్ల పాకల్-దుల్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. అంతేగాక, ఉరి ఘటన తర్వాతే సింధూ నదీ జలాలపై ఉన్న మరో రెండు ప్రాజెక్టుల పనులు వేగవంతమయ్యాయి. భారత్పై ఉగ్రవాదాన్ని ప్రయోగించడంతో పాటు సింధూ జలాల ఒప్పందం విషయంలో పాక్ పాల్పడుతున్న ఉల్లంఘనలకు గట్టి సమాధానమిచ్చేందుకే మోదీ సర్కారు పలు ప్రాజెక్టులు చేపట్టింది. ఒప్పందం నిబంధనలకు లోబడి సింధూ జలాల గరిష్ఠ వినియోగించుకొనేందుకు చీనాబ్, జీలమ్ నదులపై మౌలిక వసతుల పనులను వేగవంతం చేసింది. వీటితో పాక్ ఆగడాలకు కళ్లెం వేయాలనేది కేంద్ర సర్కారు యోచన.
సింధూ జలాల ఒప్పందం (Indus water treaty) విషయంలో పాకిస్థాన్ మొండిగా వ్యవహరిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో.. భారత్ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పంద సవరణలకు నోటీసులిచ్చింది. దీనిపై 90 రోజుల్లోగా ఇరు దేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉంటుంది. అయితే, ఈ నోటీసుపై పాక్ నుంచి ఇంతవరకూ స్పందన రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్