బంగ్లాదేశ్‌: పడవ ప్రమాదం..25 మంది మృతి

బంగ్లాదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. పద్మ నదిలో దాదాపు 30 మందితో ప్రయాణిస్తున్న ఓ  పడవను ఓ ఇసుక రవాణా ఓడ ఢీకొట్టింది. శిబ్‌చార్‌ పట్టణం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు....

Updated : 03 May 2021 11:33 IST

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. పద్మ నదిలో దాదాపు 30 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవను ఓ ఇసుక రవాణా ఓడ ఢీకొంది. శిబ్‌చార్‌ పట్టణం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురిని కాపాడినట్లు పోలీసు అధికారి మిరాజ్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉందని.. వారి కోసం అగ్నిమాపక సిబ్బంది, స్థానిక రెస్క్యూ టీం గాలిస్తున్నట్లు మిరాజ్‌ హుస్సేన్‌ వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని