Online Games: ఆన్‌లైన్ గేమ్‌కు బానిసై మతిస్థిమితం కోల్పోయిన విద్యార్థి

ఆన్‌లైన్ గేమ్‌కు బానిసై ఓ విద్యార్థి మతిస్థిమితం కోల్పోయిన ఘటన.. తమిళనాడులో జరిగింది.

Published : 10 Apr 2022 01:35 IST

చెన్నై: ఆన్‌లైన్ గేమ్‌కు బానిసై ఓ విద్యార్థి మతిస్థిమితం కోల్పోయిన ఘటన.. తమిళనాడులో జరిగింది. తిరునెల్వేలికి చెందిన 17 ఏళ్ల బాలుడు.. నిత్యం సెల్ ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాడు. సాధారణ సమయాల్లో సైతం తుపాకీ పట్టుకుని.. కాల్పులు జరుపుతున్నట్లు వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇది గమనించిన అతడి తల్లిదండ్రులు.. ఈ నెల 4న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం డాక్టర్లు ఆ యువకుడికి చికిత్స అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని