ఆ దేశంలో 75 రోజుల్లో లక్ష కరోనా మరణాలు!

బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. గడిచిన వారం రోజుల్లో ఆ దేశంలో రోజుకు సగటున 2,273 మంది మరణించారంటే పరిస్థితి తీవ్రత అద్దం పడుతోంది.

Published : 25 Mar 2021 11:21 IST

బ్రెజిలియా: బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. గడిచిన వారం రోజుల్లో ఆ దేశంలో రోజుకు సగటున 2,273 మంది మరణించారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా ఆ దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య మూడు లక్షలు దాటింది. బుధవారం రెండు వేలకు పైగా మరణాలు సంభవించడంతో.. వైరస్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రెజిల్‌లో నమోదైన మరణాల మొత్తం 3,00,685కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,251 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం గత 75 రోజుల్లోనే లక్ష మంది కరోనా ధాటికి మృత్యువాత పడినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి.

రాజకీయంగా సమన్వయలేమి వల్లే దేశంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోగ్య నిపుణులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మరోవైపు, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో ఇటీవల సంక్షోభ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధికంగా ఐదు లక్షలకు పైగా కరోనా మరణాలతో అమెరికా తొలిస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండో స్థానంలో బ్రెజిల్‌ ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని