Covid: రూల్స్ బ్రేక్.. బ్రెజిల్ అధ్యక్షుడిపై కేసు
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కొవిడ్ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఆయనపై కేసు నమోదు అయ్యింది.
చట్టం ముందు అందరూ సమానమేన్న రాష్ట్ర గవర్నర్
సావో లూయిస్: కరోనా వైరస్ ధాటికి బ్రెజిల్ కూడా వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో వైరస్ కట్టడిలో అధ్యక్షుడు జైర్ బోల్సోనారో విఫలమయ్యారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు కొవిడ్ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఆయనపై కేసు నమోదు అయ్యింది.
బ్రెజిల్లోని మారన్హవో రాష్ట్రంలో కొవిడ్ కట్టడి ఆంక్షల్లో భాగంగా వందమందికిపైగా పాల్గొనే సమావేశాలపై నిషేధం ఉంది. అంతేకాకుండా మాస్కు ధరించని వారిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మారన్హవో రాజధాని సావో లూయిస్ నగరంలో జరిగిన ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మాస్కు కూడా ధరించలేదు. అంతేకాకుండా కొవిడ్ ఆంక్షలను అమలు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వ అధినేతను ‘చబ్బీ డిక్టేటర్’ అంటూ సంబోధించారు.
దీనిపై మారన్హవో రాష్ట్ర గవర్నర్ ఫ్లావియో డైనో స్పందించారు. స్థానికంగా ఉన్న కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినందున అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై అధికారులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రోత్సహించేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో కేసు నమోదు చేశామని స్పష్టంచేశారు. అయితే, అధ్యక్షుడిపై కేసు నమోదు చేసినప్పటికీ దీనిపై అప్పీలుకు వెళ్లేందుకు 15రోజుల సమయం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం జరిమానా విధించే అవకాశాలున్నాయి.
ఆది నుంచీ అదే తీరు..
ప్రపంచంలో కొవిడ్ మరణాలు అత్యధికంగా చోటుచేసుకుంటున్న దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. అమెరికాలో అత్యధికంగా దాదాపు ఆరు లక్షల మంది ప్రాణాలు కోల్పోగా బ్రెజిల్లో 4.5 లక్షల మంది మృత్యువాతపడ్డారు. అయినప్పటికీ కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయడంలో అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మొదటి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓవైపు మాస్కులు ధరించడాన్ని వ్యతిరేకిస్తూనే.. ప్రజలు సమూహాలుగా ఏర్పడవచ్చని ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్త లాక్డౌన్ను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురావడంపైనా తాత్సారం చేస్తున్న బోల్సోనారో.. కేవలం హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారానే మహమ్మారిని అధిగమించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడి తీరు ఇలా ఉన్నప్పటికీ బ్రెజిల్లో పలు రాష్ట్రాలు మాత్రం కొవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్