Pakistan: గుజరాత్ తీరంలో పాక్ పడవలు.. భారత కమాండోల ఎయిర్డ్రాపింగ్..!
గుజరాత్ తీరంలోని సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్కు చెందిన 11 పాకిస్థాన్ పడవలు భారత జలాల్లోకి చొరబడటంతో బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకొంది.ఈ ఘటన హరామీ నాలా వద్ద చోటు చేసుకొంది. సాధారణ తనిఖీల్లో భాగంగా నిన్న
ఇంటర్నెట్డెస్క్: గుజరాత్ తీరంలోని సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్కు చెందిన 11 పడవలు భారత జలాల్లోకి చొరబడటంతో బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకొంది. ఈ ఘటన హరామీ నాలా వద్ద చోటు చేసుకొంది. సాధారణ తనిఖీల్లో భాగంగా నిన్న ఒక డ్రోన్ కెమెరాను ప్రయోగించి ఆ ప్రాంతంలో తనిఖీలు చేయగా.. మొత్తం 11 పాకిస్థాన్ పడవలను గుర్తించారు. అయితే.. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. దీంతో ఈ పడవల ద్వారా పాక్ నుంచి భారత్లో ఎవరైనా ప్రవేశించారా.. అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మరిన్ని పడవలు దొరికే అవకాశం ఉందని బీఎస్ఎఫ్ ఐజీ జీఎస్ మలిక్ పేర్కొన్నారు.
రంగంలోకి కమాండోలు..
రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పాకిస్థానీలు నక్కి ఉండే అవకాశం ఉన్న ప్రదేశాలను బీఎస్ఎఫ్ గుర్తించింది. దీంతో నిన్న వాయుసేనకు చెందిన మూడు కమాండో బృందాలను వేర్వేరు చోట్ల ఎయిర్ డ్రాప్ చేశారు. నిన్న రాత్రి కూడా ఆపరేషన్ కొనసాగింది. ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. ఇక్కడ విపరీతమైన చిత్తడి నేలలు, మడ అడవులు, ఆటు-పోట్లు కారణంగా సెర్చ్ ఆపరేషన్ కఠినంగా మారినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ప్రాంతం అత్యంత కీలకం ఎందుకు..?
భారత్లోని గుజరాత్ను.. పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతం నుంచి వేరు చేస్తూ ఉన్న 96 కిలోమీటర్ల పొడవైన నీటి పాయను సర్ క్రీక్ అంటారు. ఇది నేరుగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. భౌగోళికంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం. అంతేకాదు.. ఇక్కడ అపారమైన మత్స్య సంపద ఉంది. ఆసియాలో చేపల వేట జరిగే అతిపెద్ద ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. దీంతోపాటు ఇక్కడ చమురు నిక్షేపాలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా భాగాన్ని పాక్ తనదిగా చెప్పుకుంటోంది. కానీ. ఇవి భారత్ ఆధీనంలో ఉన్నాయి.
1965 యుద్ధానికి ముందు ఇక్కడ ఒక సైనిక ఘర్షణ జరిగింది. అనంతరం ఒక ట్రైబ్యూనల్ను ఏర్పాటు చేయగా.. 1968లో అది తీర్పును వెలువరించింది. పాక్ చెప్పుకొంటున్న భూభాగంలో కేవలం 10శాతం మాత్రమే దానికి దక్కింది. ఆ తర్వాత నుంచి దాదాపు డజను సార్లు ఈ సమస్యపై చర్చలు జరిగాయి.
1999లో పాక్ విమానాన్ని కూల్చేసిన భారత్..
1999లో కార్గిల్ యుద్ధం ముగిసిన నెల రోజుల తర్వాత పాక్ నౌకాదళానికి చెందిన అట్లాంటిక్-91 రవాణా విమానం రాణ్ ఆఫ్ కచ్ వద్ద సరిహద్దుల సమీపానికి వచ్చింది. భారత రాడార్లు గుర్తించాయి. వెంటనే భారత వాయుసేన 45వ స్క్వాడ్రన్కు చెందిన మిగ్-21 విమానాలు దానిని వెంటాడాయి. ఆర్-60 క్షిపణి సాయంతో దానిని కూల్చివేశాయి. ఈ ఘటనలో ఐదుగురు పాక్ నేవీ అధికారులతో సహా 16 మంది చనిపోయారు. మర్నాడు భారత పాత్రికేయులను తీసుకెళుతున్న హెలికాప్టర్పై పాక్ కాల్పులు జరిపింది. దీంతో ఆ ప్రయాణాన్ని విరమించుకొన్నారు. పాక్ కూడా ఓ విదేశీ బృందాన్ని అట్లాంటిక్-91 విమానం కూలిన ప్రదేశానికి తీసుకెళ్లి చూపించింది. తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్ కేసు వేసింది. కానీ, ఈ కేసులో భారత్కు అనుకూలంగా తీర్పు రావడం పాక్కు శరాఘాతంగా మారింది.
స్మగ్లింగ్కు మార్గంగా..
మాదక ద్రవ్యాల అత్యధిక సరఫరా జరిగే ‘బంగారు నెలవంక’(పాక్-అఫ్గాన్-ఇరాన్)కు అత్యంత సమీపంలోనే భారత్ ఉంది. అరేబియా సముద్ర మార్గంలో నిర్మానుష్యమైన సర్క్రీక్ ప్రాంతానికి మాదకద్రవ్యాలు చేరవేయడం తేలిక. పలు మార్లు అధికారులు ఇక్కడ మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. కొన్నాళ్ల క్రితం భారత్ ఇక్కడ పెట్రోలింగ్ హోవర్ క్రాఫ్ట్లను మోహరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల