Uttarakhand: లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి, 20మందికి గాయాలు..!

ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) దేహ్రాదూన్‌లో ఓ బస్సు లోయలో పడిపోయిన ప్రమాదంలో (Bus Accident) ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 మందికిపైగా గాయపడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

Published : 02 Apr 2023 15:54 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముస్సోరీ (Mussoorie) నుంచి దేహ్రాదూన్‌కు వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోగా డ్రైవర్‌తో సహా మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొన్నాయి. ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీసుల (ITBP) సహాయంతో గాయపడిన వారిని రెస్క్యూ చేసి ఆస్పత్రికి తరలించామని మసూరీ పోలీసులు వెల్లడించారు.

ఉత్తరాఖండ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన ఓ బస్సు ముస్సోరీ నుంచి దేహ్రాదూన్‌ వెళ్తోంది. సుమారు 25 మంది ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు.. శేర్‌ఘాటీ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. సుమారు 70 అడుగుల లోతులో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ముస్సోరి పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని