హత్యను దాచబోయి.. కార్చిచ్చుకు కారణమై..
గతేడాది ఆగస్టులో అమెరికాలో కాలిఫోర్నియా భారీ కార్చిచ్చు సంభవించిన విషయం తెలిసిందే. ఆ అగ్నికీలల్లో వందలాది భవంతులు కాలి బూడిదయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
కాలిఫోర్నియా: గతేడాది ఆగస్టులో అమెరికాలో కాలిఫోర్నియా భారీ కార్చిచ్చు సంభవించిన విషయం తెలిసిందే. ఆ అగ్నికీలల్లో వందలాది భవంతులు కాలి బూడిదయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే, ఆ ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేసే క్రమంలో వెలుగుచూసిన నిజాలతో పోలీసులు షాకయ్యారు. ఓ మనిషిని చంపేసి, ఆ హత్యను దాచిపెట్టే ప్రయత్నం.. కార్చిచ్చుకు దారితీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఉత్తర కాలిఫోర్నియాలోని సొలానో కౌంటీలో గల అడవుల్లో గతేడాది ఆగస్టులో మంటలు చెలరేగాయి. అది కాస్తా అడవి మొత్తం వ్యాపించింది. అయితే సొలానో కౌంటీలో మంటలు చెలరేగిన ప్రాంతానికి సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు ఆ తర్వాత గుర్తించారు. దర్యాప్తులో ఆ మృతదేహం 32ఏళ్ల ప్రిసిల్లా కాస్ట్రోగా తేలింది. అగ్నిప్రమాదానికి రెండు రోజుల ముందు విక్టర్ సెరింటినో అనే వ్యక్తితో డేట్కు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో అతడిని అరెస్టు చేశారు. ‘‘8 నెలల సుదీర్ఘ దర్యాప్తు ఆధారంగా సెరింటినో తన నేరాన్ని దాచిపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే అడవికి నిప్పుపెట్టాడని మేం విశ్వసిస్తున్నాం’’ అని పోలీసులు తాజాగా ఇచ్చిన ప్రకటనలో వెల్లడించారు.
సొలానో కౌంటీలో మొుదలైన మంటలు క్రమక్రమంగా విస్తరించాయి. అదే సమయంలో అడవిలోని కొన్నిచోట్ల పిడుగులు పడటంతో మరిన్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో భారీ కార్చిచ్చు సంభవించింది. కాలిఫోర్నియా చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చుల్లో ఒకటిగా మిగిలింది. మంటల ఉద్ధృతికి వేల సంఖ్యలో భవనాలు కాలిపోయాయి. దాదాపు 3.63లక్షల ఎకరాల్లో చెట్లు బూడిదయ్యాయి. సుమారు ఐదు లక్షల మంది ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.