దేశవ్యాప్త లాక్డౌన్కు మద్దతు పెరుగుతోందా..?
దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలనే స్వరం పెరుగుతోంది. తాజాగా అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) జరిపిన సర్వేలో పాల్గొన్న వారిలో 67శాతం మంది లాక్డౌన్కు మద్దతు ఇచ్చినట్లు పేర్కొంది.
వ్యాపార సంఘాల సర్వేలోనూ అదే స్వరం
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ.. కేసులతో పాటు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలనే స్వరం పెరుగుతోంది. తాజాగా అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) జరిపిన సర్వేలో పాల్గొన్న వారిలో 67శాతం మంది లాక్డౌన్కు మద్దతు ఇచ్చినట్లు పేర్కొంది. కొవిడ్ విలయంతో దేశంలో పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో కొన్నిరోజుల పాటు లాక్డౌన్ విధించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వానికి సీఏఐటీ విజ్ఞప్తి చేసింది.
గతకొన్ని వారాలుగా దేశంలో కొవిడ్ విజృంభణ తీవ్రమైన నేపథ్యంలో తక్షణమే దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ ఖాండేవాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. లాక్డౌన్ విధిస్తే గతేడాది చేసినట్లుగానే నిత్యావసర వస్తువులను ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా చేసేందుకు దేశవ్యాప్తంగా వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఒకవేళ దేశవ్యాప్తంగా పూర్తి లాక్డౌన్ సాధ్యంకాని పక్షంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనైనా పూర్తిగా లాక్డౌన్ విధించాలని కోరారు. ఇదే విషయమై 9వేల మందిపై జరిపిన సర్వేలో దాదాపు 78శాతం మంది కొవిడ్ తీవ్రత నియంత్రించలేని విధంగా ఉందని అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. ఇక 67.5 శాతం మంది దేశవ్యాప్తంగా లాక్డౌన్కే మద్దతు తెలిపినట్లు వెల్లడించారు.
దేశంలో లాక్డౌన్ విధిస్తే ఎక్కువగా నష్టపోయేది వ్యాపారులమేనని.. అయినప్పటికీ అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతున్న మహమ్మారిని అదుపులోకి తేవడం తక్షణ అవసరమని సీఏఐటీ సభ్యులు అభిప్రాయడ్డారు. ఒకవేళ దేశంలో లాక్డౌన్ విధించిన పక్షంలో తాత్కాలికంగా పన్ను మినహాయింపుతో పాటు ఈఎంఐల వసూలును వాయిదా వేసేలా బ్యాంకులకు ఆదేశాలివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
లాక్డౌన్కు పెరుగుతోన్న మద్దతు..?
దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంపై కేంద్ర, రాష్ట్రాలు పరిశీలించాలని భారత అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దేశంలో వైరస్ కట్టడికి ప్రస్తుత చర్యలు సరిపోవడం లేదని.. లాక్డౌన్ ఒక్కటే మార్గమని ఈ మధ్యే ఎయిమ్స్ డైరెక్టర్తోపాటు ఇతర ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు మాత్రం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే పూర్తి లాక్డౌన్ అమలు చేయాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కూడా భారత్లో కొద్ది వారాలపాటు లాక్డౌన్ అవసరమని అభిప్రాయపడ్డారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మహమ్మారి పోరులో లాక్డౌన్ చివరి ఆయుధంగా వాడాలని పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ఉద్ధృతితో కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. నిత్యం దాదాపు 4లక్షల కేసులు నమోదు కావడంతోపాటు 3వేలకు పైగా కొవిడ్ రోగులు మృత్యువాతపడుతున్నారు. దీంతో చాలా రాష్ట్రాలు ఇప్పటికే పాక్షిక లాక్డౌన్, కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దాదాపు పది రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగిస్తుండగా పలు రాష్ట్రాలు వాటిని ఎప్పటికప్పుడు పొడిగించేందుకే మొగ్గు చూపుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం