Sanjay Raut: ‘సావర్కర్’ విషయంలో కాంగ్రెస్తో రాజీ పడలేం: సంజయ్ రౌత్
ప్రతి అంశంలో ఏకీభవించాలని కాంగ్రెస్ పార్టీతో తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. సావర్కర్ విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు.
ముంబయి: హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను శివసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. దీంతో ఈ పార్టీ మధ్య బంధం తెగిపోనుందని వార్తలు వచ్చాయి. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా స్పందించారు. కాంగ్రెస్తో పొత్తు ఉన్నప్పటికీ.. అన్ని విషయాల్లో ఆ పార్టీతో ఏకీభవించలేమని తెలిపారు. సావర్కర్, హిందుత్వ వంటి అంశాల్లో తాము ఎప్పటికీ రాజీపడలేమని స్పష్టం చేశారు.
‘‘భారతీయ జనతా పార్టీతో మాకు విభేదాలు ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. అది సజావుగానే సాగింది. ఇప్పుడు మేం భాజపాను వీడాం. కానీ మా సిద్ధాంతాలను కాదు. ప్రతి అంశంలో ఏకీభవించాలని కాంగ్రెస్ పార్టీతో మేం ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కొన్ని అంశాల్లో శివసేన ఎప్పటికీ రాజీపడదు. హిందుత్వ, వీర్ సావర్కర్ లాంటి అంశాలు మా సిద్ధాంతాలు ఎప్పటికీ ఒకేలా ఉంటాయి’’ అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ రౌత్ వెల్లడించారు.
ఇక, విభేదాలు ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల కోసం కొన్ని బంధాలను కొనసాగించాల్సి ఉంటుందని రౌత్ ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో శివసేన మైత్రి సుదీర్ఘకాలం కొనసాగుతుందా? అని ప్రశ్నించగా.. దేశానికి అవసరమైతే తప్పకుండా ఉంటుందని తెలిపారు. ‘‘ప్రజాస్వామ్యం, ప్రజల స్వేచ్ఛ, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మేం మా విభేదాలను పక్కనబెట్టి చేతులు కలిపాం’’ అని రౌత్ వివరించారు.
‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా వాసిం జిల్లాలో నిర్వహించిన ఓ సభలో రాహుల్ గాంధీ సావర్కర్పై విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీకీ, ఆరెస్సెస్కు ఆయనో చిహ్నమని పేర్కొన్నారు. అండమాన్ జైల్లో 2-3 ఏళ్ల పాటు ఉన్న సావర్కర్.. క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ వారికి అర్జీలు పెట్టుకున్నారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను శివసేన నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ఖండించారు. ఆ తర్వాత శివసేన అధికార పత్రిక సామ్నాలో రాహుల్ వ్యాఖ్యలను విమర్శిస్తూ సంజయ్ రౌత్ సంపాదకీయం రాశారు.
ఇదిలా ఉండగా.. భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ.. ఆదివారం రౌత్కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీంతో సంతోషపడిన శివసేన ఎంపీ.. రాహుల్పై ప్రశంసలు కురిపించారు. రాహుల్జీ చర్య అభినందనీయమని, రాజకీయ సమరంలో ఇలాంటివి చాలా అరుదుగా కన్పిస్తాయని కొనియాడారు. పాత్రాఛల్ కుంభకోణం కేసులో ఇటీవల జైలు నుంచి విడుదలైన రౌత్.. ప్రస్తుతం దిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ పెద్దలతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!