లైంగిక వేధింపుల కేసులను మరుగుపరచలేం
లైంగిక వేధింపుల కేసులను మరుగుపరచడాన్ని తాము సమ్మతించలేమని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టంచేసింది. మధ్యప్రదేశ్లో
సుప్రీం కోర్టు స్పష్టీకరణ
మాజీ జడ్జిపై విచారణకు ఆదేశం
దిల్లీ: లైంగిక వేధింపుల కేసులను మరుగుపరచడాన్ని తాము సమ్మతించలేమని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టంచేసింది. మధ్యప్రదేశ్లో ఒక జిల్లా మాజీ జడ్జిపై వచ్చిన ఈ తరహా ఆరోపణలపై అంతర్గతంగా శాఖాపరమైన విచారణ జరగాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సదరు మాజీ జడ్జి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా న్యాయాధికారి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై శాఖాపరమైన విచారణకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మొదట ఇచ్చిన ఫిర్యాదును బాధితురాలు వెనక్కి తీసుకున్నారని, రాజీకి సంసిద్ధత వ్యక్తంచేశారని మాజీ జడ్జి తరఫు న్యాయవాది ఆర్.బాలసుబ్రమణ్యం వాదించారు. దీన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రస్తుతం సదరు మాజీ న్యాయమూర్తి ‘దోషి’గానే ఉన్నారని, విచారణను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధపడితే నిర్దోషిగా బయటపడే అవకాశం ఉండొచ్చని తెలిపింది. జూనియర్ అధికారిపై ఈ తరహా వ్యవహారశైలి ఒక జడ్జి హోదాకు తగదని వ్యాఖ్యానించింది. హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతికి ఆ జడ్జి పేరు పరిశీలనలో ఉన్న సమయంలోనే ఆయనపై ఈ ఆరోపణలు వచ్చాయన్న బాలసుబ్రమణ్యం వాదనను పరిగణనలోకి తీసుకుంది. అయితే శాఖాపరమైన విచారణకు ఆదేశించే అధికారం హైకోర్టుకు ఉందా అన్నదే తాను ప్రస్తుతం తేల్చాల్సిన అంశమని పేర్కొంది. హైకోర్టుకు ఆ అధికారం ఉందని, విచారణను మాజీ జడ్జి ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేసింది. ‘ఇబ్బందికరమైన పరిస్థితి’ వల్లే ఫిర్యాదుదారు తన ఫిర్యాదును వెనక్కి తీసుకొని ఉంటారని, శాఖపరమైన చర్యలకు అది అడ్డుకాజాలదని తేల్చి చెప్పింది.
జీవిత భాగస్వామి ప్రతిష్ఠను దెబ్బతీయడం మానసిక క్రూరత్వమే
జీవిత భాగస్వామిని కించపరిచేలా ఫిర్యాదులుచేసి, అతని ప్రతిష్ఠను దెబ్బతీయడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఓ సైనికాధికారి జంటకు విడాకులు మంజూరు చేస్తూ ఇలా వ్యాఖ్యలు చేసింది. ఆ జంట మధ్య బంధం విచ్ఛిన్నం కాగా.. అవి మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే సాధారణ కలహాలేనంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. భార్య తనను మానసికంగా వేధిస్తోందని, ఆమె నుంచి విడాకులు ఇప్పించాలంటూ భర్త వేసిన పిటిషన్పై జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ జంటకు 2006లో వివాహమైంది. కొద్దినెలలు కలిసి ఉన్నారు. మొదటి నుంచే వీరి మధ్య విభేదాలు ఉన్నాయి. 2007 నుంచే విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తమ దాంపత్య బంధాన్ని పునరుద్ధరించాలని భార్య పిటిషన్ వేశారు. సైనిక ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు చేశారు. వాటిపై సైన్యం విచారణకు ఆదేశించింది. ఇలాంటి కేసుల్లో దంపతుల విద్య, సమాజంలో స్థాయి వంటి అంశాలను చూడాలని సుప్రీం కోర్టు పేర్కొంది. విద్యాధికురాలైన భార్య చేసే ఇలాంటి ఆరోపణల వల్ల భర్త ప్రతిష్ఠకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని తెలిపింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం వల్ల భర్త వృత్తి జీవితంపై ప్రభావం పడిందని వ్యాఖ్యానించింది. అందువల్ల ఈ తరహా వ్యవహారశైలిని క్షమించాలని ఆశించరాదని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!