Petrol bomb: జవాన్ల క్యాంప్‌పై మహిళ బాంబు దాడి.. వీడియో వైరల్

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) క్యాంప్‌పై ఓ మహిళ పెట్రోల్‌ బాంబ్‌తో దాడిచేసింది......

Published : 31 Mar 2022 01:16 IST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) క్యాంప్‌పై ఓ మహిళ పెట్రోల్‌ బాంబుతో దాడిచేసింది. బారాముల్లా జిల్లా సోపోర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌ వద్ద మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బుర్ఖా ధరించి రోడ్డుపై నడుచుకుంటూ వచ్చిన మహిళ.. క్యాంప్‌ గేట్‌ వద్ద ఆగి, చేతి సంచిలోనుంచి పెట్రోల్‌ బాంబ్‌ తీసి క్యాంప్‌పై విసిరేసింది. అనంతరం వెంటనే అక్కడినుంచి పారిపోయింది. కాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఆ బాంబు సెక్యూరిటీ క్యాంప్‌ బయటే పడిందని, మంటలను జవాన్లు ఆర్పేసినట్లు పేర్కొన్నారు. సదరు మహిళను గుర్తించామని, ఆ ప్రాంతంలో కట్టడిముట్టడి చేపట్టి నిందితురాలి కోసం గాలిస్తున్నట్లు కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. త్వరలోనే ఆమెను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని