Drugs: డ్రగ్స్‌ అక్రమరవాణాపై సీబీఐ ‘ఆపరేషన్‌ గరుడ’.. 175 మంది అరెస్టు

మాదకద్ర్యవాల అక్రమ రవాణాపై సీబీఐ ‘ఆపరేషన్‌ గరుడ’ పేరిట దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఎన్సీబీ, ఇంటర్‌పోల్‌తో పాటు పలు రాష్ట్రాల్లోని పోలీసుల......

Published : 30 Sep 2022 01:09 IST

దిల్లీ: మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సీబీఐ ‘ఆపరేషన్‌ గరుడ’ పేరిట దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఎన్సీబీ, ఇంటర్‌పోల్‌తో పాటు పలు రాష్ట్రాల్లోని పోలీసుల సమన్వయంతో డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లపై దాడులు కొనసాగించింది. ఈ సందర్భంగా భారీగా మాదకద్రవ్యాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 127 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 175మంది డ్రగ్స్‌ వ్యాపారులను అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు గురువారం వెల్లడించారు.అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలను విచ్ఛిన్నం చేయడంతో పాటు డ్రగ్స్‌ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ఈ వారం ఆరంభం నుంచి కొనసాగిన ‘ఆపరేషన్‌ గరుడ’లో భాగంగా ఆయా ఏజెన్సీలు 127 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాయని తెలిపారు. 

పంజాబ్, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్ర సహా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్సీబీ అధికారులు, పోలీసులు ఈ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు 6,600 మంది అనుమానితులను ట్రాక్‌ చేశారు. ఆ తర్వాత 127 కేసులు నమోదుచేసి పరారీలో ఉన్న ఆరుగురితో పాటు మొత్తం 175మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్‌ ఇతర పదార్థాల అక్రమ రవాణాను ఏజెన్సీలు లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సీబీఐ, ఎన్సీబీ ఏజెన్సీలు సమాచార మార్పిడి, విశ్లేషణ, కార్యాచరణ సమాచారం కోసం ఆయా రాష్ట్రాల నిఘా సంస్థలు, పోలీసులతో కలిసి పనిచేశాయి.ఈ దాడుల్లో భాగంగా 5కిలోల హెరాయిన్‌, 34కిలోల గంజాయి, 3కిలోల చరస్‌తో పాటు భారీగా ఇతర డ్రగ్స్‌ని సీజ్‌ చేసినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని