Mehul Choksi: మెహుల్ ఛోక్సీ రెడ్కార్నర్ నోటీసు రద్దుపై సీబీఐ అప్పీల్..
పీఎన్బీ కుంభకోణం నిందితుడు మెహుల్ ఛోక్సీ (Mehul Choksi)పై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసును ఎత్తివేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తోన్న నేపథ్యంలో సీబీఐ చర్యలకు ఉపక్రమించింది.
దిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13వేల కోట్ల మేర మోసం చేసిన కేసులో దేశం విడిచి పారిపోయిన మెహుల్ ఛోక్సీ (Mehul Choksi)పై జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసులను (Red Corner Notice) ఉపసంహరించడంపై సీబీఐ (CBI) స్పందించింది. ఆ నోటీసును పునరుద్ధరించాలని కమిషనల్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ఇంటర్పోల్ ఫైల్స్ (సీసీఎఫ్)ను అభ్యర్థించింది. ఈ మేరకు సీబీఐ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
పీఎన్బీ కుంభకోణం (PNB Scam) వెలుగులోకి వచ్చిన తర్వాత సీబీఐ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ED) అభ్యర్థన మేరకు 2018లో ఇంటర్పోల్ (Interpol).. ఛోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దీనిపై 2020లో ఛోక్సీ అప్పీల్ చేసుకున్నప్పటీకీ ఇంటర్పోల్ ఆ నిర్ణయాన్ని మార్చలేదు. అయితే, ఆ మరుసటి ఏడాది ఆంటిగ్వాలో ఛోక్సీ ‘కిడ్నాప్’ వ్యవహారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 2022లో ఆయన.. సీసీఎఫ్ను ఆశ్రయించాడు.
ఈ విభాగం ఇంటర్పోల్కు చెందినదే అయినా.. ఇంటర్పోల్ సెక్రటేరియట్ నియంత్రణలో ఉండదు. పలు దేశాల నుంచి ఎన్నికైన న్యాయవాదులు ఇందులో పనిచేస్తారు. ఛోక్సీ అప్పీల్ను పరిశీలించిన సీసీఎఫ్ ఐదుగురు సభ్యుల ఛాంబర్.. రెడ్ కార్నర్ నోటీసులను (Red Notice) ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఛోక్సీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్లేందుకు అవకాశం లభించింది.
కాగా.. ఈ నిర్ణయంపై భారత సీబీఐ తాజాగా స్పందించింది. ‘‘కేవలం ఊహాత్మక అభిప్రాయాలు, నిరూపణ లేని ఆధారాలతో సీసీఎఫ్ (CCF) ఛాంబర్.. ఛోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు ఎత్తివేసింది. అయితే ఈ నిర్ణయంతో భారత్లోని నేరాలకు ఛోక్సీ నిరపరాధి అని తాము చెప్పడం లేదని సీసీఎఫ్.. సీబీఐకి స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంపై సీబీఐ (CBI) తదుపరి చర్యలు చేపట్టింది. లోపాలతో కూడిన ఈ నిర్ణయాన్ని సరిదిద్దడంతో పాటు రెడ్ కార్నర్ నోటీసును పునరుద్ధరించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సీబీఐ పరిశీలిస్తోంది’’ అని దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి 10 నెలల ముందే ఛోక్సీ దేశం విడిచి పారిపోయాడు. 2017లోనే ఛోక్సీ ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకుని 2018 నుంచి ఆ దేశంలోనే ఉంటున్నాడు. ఛోక్సీ పౌరసత్వం రద్దు చేయాలని భారత్.. ఆంటిగ్వాను కోరినప్పటికీ అందుకు ఆ దేశం ఒప్పుకోలేదు. అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.