అనిల్‌ దేశ్‌ముఖ్‌కు సీబీఐ సమన్లు

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లు జారీ చేసింది. అవినీతి ఆరోపణల కేసును ఎదుర్కొంటున్న ఆయనను బుధవారం నాడు విచారణకు హాజరు కావాలని సీబీఐ సూచించింది.

Published : 12 Apr 2021 20:01 IST

బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశం

ముంబయి: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లు జారీ చేసింది. అవినీతి ఆరోపణల కేసును ఎదుర్కొంటున్న ఆయనను బుధవారం నాడు విచారణకు హాజరు కావాలని సీబీఐ సూచించింది.

 నెలకు రూ.వంద కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండైన పోలీసు అధికారి సచిన్‌ వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా పోలీసు అధికారుల బదిలీల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. వీటిపై విచారణ జరిపించాలని పరంబీర్‌ సింగ్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన బాంబే హైకోర్టు.. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ బృందం ఇప్పటికే అనిల్‌ దేశ్‌ముఖ్‌ వ్యక్తిగత సహాయకుడితో పాటు మరికొందరిని విచారించింది. తాజాగా మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీచేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సచిన్‌ వాజేకు సన్నిహితుడైన ఓ బార్‌ యజమానిని సీబీఐ విచారించి అతని స్టేట్‌మెంట్‌ రికార్డు చేసింది.

ఇదిలాఉంటే, తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని అనిల్‌ దేశ్‌ముఖ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, అనిల్‌ దేశ్‌ముఖ్‌ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని