నేడే సీబీఎస్‌ఈ పరీక్ష తేదీల విడుదల ..

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్ష తేదీలను ఈ సాయంత్రం ఆరు గంటలకు ప్రకటించనున్నారు.

Published : 31 Dec 2020 12:52 IST

దిల్లీ: సీబీఎస్‌ఈ బోర్డు పరిధిలోకి వచ్చే విద్యాసంస్థల్లో 2020-21 విద్యాసంవత్సరానికి గాను పరీక్షల తేదీలు నేడు ప్రకటించనున్నారు. 10, 12 తరగతుల పరీక్ష తేదీలను కేంద్ర విద్యా మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ నిశాంక్‌, తన ట్విటర్‌ ఖాతా (https://twitter.com/DrRPNishank)లో ఈ సాయంత్రం ఆరు గంటలకు ప్రకటించనున్నారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి తరువాతే ఉంటాయని మంత్రి మంగళవారం వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా పరీక్షలను రాతపూర్వక విధానంలోనే నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ బోర్డు గతంలోనే స్పష్టం చేసింది. కాగా, ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

ఇవీ చదవండి..

పనికొచ్చేవే చదువుతున్నామా?

నీట్‌ రద్దు చేసే ఆలోచనే లేదు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని