CBSE: పదో తరగతి మార్కులను ఎలా ఇస్తారంటే?
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ తాజాగా తీసుకున్న.....
FAQ విడుదల చేసిన బోర్డు
దిల్లీ: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ తాజాగా తీసుకున్న నిర్ణయంతో మార్కుల కేటాయింపులో మరింత జాప్యం నెలకొంది. జూన్ 11 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, 20న ఫలితాలు వెల్లడిస్తామని ఇంతకుముందు ప్రకటించిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఇటీవలే ఆ గడువును పెంచింది. జూన్ 30 నాటికి ఆయా పాఠశాలలు అంతర్గత మదింపు ఆధారంగా చేసిన మార్కుల కేటాయింపును పూర్తి చేసి జాబితాలను పంపాలని ఆదేశించింది. అయితే, సీబీఎస్ఈ మార్కుల కేటాయింపుపై విద్యార్థులు/ తల్లిదండ్రులు/ ఉపాధ్యాయుల్లో వ్యక్తమయ్యే పలు సందేహాలను నివృత్తి చేసేందుకు ఎఫ్ఏక్యూ (తరచూ వచ్చే సందేహాలు)ను సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసింది.
* సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలను ఎలా ప్రకటిస్తారు?
బోర్డు రూపొందించిన ఆబ్జెక్టివ్ క్రైటీరియా విధానం ఆధారంగా పదో తరగతి ఫలితాలను ప్రకటిస్తారు.
* ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా ప్రకటించిన ఫలితాలతో ఏ విద్యార్థి అయినా సంతృప్తి చెందకపోతే.. అలాంటి వారికి సీబీఎస్ఈ ఎలాంటి అవకాశం కల్పిస్తుంది?
ఎవరైతే బోర్డు కేటాయించిన మార్కులతో సంతృప్తి చెందరో.. వారంతా కరోనాతో నెలకొన్న పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత సీబీఎస్ఈ నిర్వహించే పరీక్షలు రాసేందుకు వీలు కల్పిస్తారు.
* పాఠశాలలు డేటా అప్లోడ్ చేసేందుకు గడువు జూన్ 11. పదో తరగతి పరీక్షల రద్దు నేపథ్యంలో దీన్ని పొడిగించే అవకాశం ఏమైనా ఉందా?
డేటా అప్లోడ్ చేసేందుకు గడువును జూన్ 30 వరకు పొడిగించాం.
* విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా సీబీఎస్ఈ కేటాయించిన మార్కులు ఎక్కడ అందుబాటులో ఉంటాయి?
బోర్డు వెబ్సైట్లో ప్రతి స్కూల్కు ఒక లాగిన్ ఉంటుంది. ఆ స్కూల్ లాగిన్ అకౌంట్లో ఆయా పాఠశాలల విద్యార్థులకు సబ్జెక్టులవారీగా వచ్చిన మార్కుల వివరాలు అందుబాటులో ఉంటాయి.
* అసెస్మెంట్కు గైర్హాజరైన విద్యార్థుల విషయంలో పాఠశాలలు ఎలా వ్యవహరించాలి?
పాఠశాలలు నిర్వహించే ఏ అసెస్మెంట్కూ హాజరుకాని విద్యార్థులకు ఆయా పాఠశాలలు ఆఫ్లైన్/ఆన్లైన్లో గానీ లేదా టెలీఫోన్లో గానీ ఆ విద్యార్థిని మదింపు చేయవచ్చు. ఆ అంశాలను ధ్రువీకరించేందుకు వీలుగా డాక్యుమెంటరీ సాక్ష్యాలను రికార్డు చేయాల్సి ఉంటుంది.
* బోర్డు ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు ఆ పరీక్ష కాపీలను చూడాలనుకున్నా.. ఆ మార్కులను వెరిఫై చేయాలనుకున్నా పాఠశాలలు ఏం చేయాలి?
ఈ సంవత్సరానికైతే అలాంటి సదుపాయం ఏమీ లేదు.
* పాఠశాలల అంతర్గత మదింపు బోర్డు ఆదేశాలకు అనుగుణంగా లేనట్టయితే మార్కులను ఎలా కేటాయిస్తారు?
విద్యార్థులు రాసిన పరీక్షల ఆధారంగా మార్కులను కమిటీయే ఖరారు చేస్తుంది. ఆ మదింపు బోర్డు గైడ్లైన్స్ ప్రకారం ఉన్నాయో, లేదో నిర్ధారణ చేసుకొని వాటిని పరిగణనలోకి తీసుకొంటారు.
మరోవైపు, దేశంలో కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా.. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే, పదో తరగతి పరీక్షలకు మార్కుల మదింపు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీబీఎస్ఈ తెలిపింది. బోర్డు కొత్త విధానం ప్రకారం.. ప్రతి సబ్జెక్టుకు వంద మార్కులుంటాయి. అందులో ఇంటర్నల్ (అంతర్గత) మార్కులు 20 కాగా.. మిగతా 80 మార్కులను ఏడాది మొత్తంలో జరిగిన వివిధ పరీక్షలలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉంటాయి. ఫలితాలను ఖరారు చేసేందుకు ప్రిన్సిపల్, ఏడుగురు ఉపాధ్యాయులతో కమిటీని ఏర్పాటు చేయాలని పాఠశాలలను బోర్డు ఆదేశించింది. సొంత పాఠశాల నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు(గణితం, సాంఘిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, రెండు భాషలకు చెందినవారు) కమిటీలో ఉండాలని తెలిపింది. మిగతా ఇద్దరు ఉపాధ్యాయులను పొరుగు పాఠశాలలకు చెందిన వారిని కమిటీలో బాహ్య సభ్యులుగా నియమించుకోవాలని సూచించింది. మార్కుల విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.