టీకా చాలా సురక్షితం
కరోనా వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవేనని సీసీఎంబీ డైరెక్టర్ డా.రాకేశ్ మిశ్రా తెలిపారు. సుదీర్ఘ పరిశోధనల తర్వాతే వాటికి అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు....
సీసీఎంబీ డైరెక్టర్తో ముఖాముఖి
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవేనని సీసీఎంబీ డైరెక్టర్ డా.రాకేశ్ మిశ్రా తెలిపారు. సుదీర్ఘ పరిశోధనల తర్వాతే వాటికి అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. సీసీఎంబీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేసిన పరిశోధనల్లో శాకాహారం తీసుకునేవారిలో తక్కువ మంది కరోనా బారిన పడినట్లు ప్రాథమికంగా గుర్తించామని పేర్కొన్నారు. అయితే దీనిపై మరింత పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొంటున్న రాకేశ్ మిశ్రాతో ముఖాముఖి.
శాకాహారులు, పొగతాగేవారిలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. శాకాహారుల్లో కరోనా వ్యాప్తి ప్రభావం ఉందా? లేదా? అధ్యయనాల్లో ఏం తేలింది?
రాకేశ్ మిశ్రా: దేశవ్యాప్తంగా సీఎస్ఐఆర్ ఉద్యోగుల్లో సీరో సర్వే ద్వారా పాజిటివిటీ రేటును తెలుసుకున్నాం. శాకాహారులు, పొగతాగేవారిలో యాంటీబాడీలు అధికంగా ఉన్నట్లు గుర్తించాం. కానీ ఈ అంశంపై అవగాహనకు వచ్చేందుకు ఇది పూర్తిస్థాయి అధ్యయన నివేదిక కాదు. మరింత సమాచారం, మరిన్ని విష్లేషణలు చేయాల్సిన అవసరం ఉంది.
ఈ అంశంపై ఎన్ని రోజుల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. నమూనా పరిణామం ఎంత?
రాకేశ్ మిశ్రా: ఈ ప్రాజెక్టు ఐదారు నెలల క్రితమే ప్రారంభమైంది. నమూనా పరిణామంలో ఏడెనిమిది వేల మంది ఉన్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. చాలా కేసుల్లో రెండు విడతల సీరో సర్వే విజయవంతంగా పూర్తయ్యింది. ఈ అధ్యయనం దీర్ఘకాలికంగా ఉంటుంది. జన్యుక్రమాలు, ఇతర వ్యాధులకు సంబంధించిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని మరిన్ని వివరాలు వెలుగులోకి తెచ్చేందుకు సుమారు 10 నుంచి 15 ఏళ్లు పట్టొచ్చు.
మీరు హైదరాబాద్ ప్రజలపై పరిశోధన చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా గుర్తించిన అంశాలేవి?
రాకేశ్ మిశ్రా: సర్వే నమూనాలను జాతీయ పోషకాహార సంస్థ సహకారంతో పూర్తిచేశాం. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఈ సర్వేలో సీరో ప్రొవిలెన్స్ గురించి అడిగాం. ప్రజలు కరోనా బారిన పడ్డారా లేదా? ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారా? ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారా?వైరస్ లక్షణాలు కనిపించాయా లేదా అనే అంశాలపై సీరో ప్రొవిలెన్స్లో తెలుసుకున్నాం. కానీ చాలా మందిలో యాంటీబాడీలు కనిపించాయి. ఈ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లో రోగనిరోధకత ఏమేర ఉన్నదనే విషయం మాకు తెలిసింది. తద్వారా ఎంతవరకు వ్యాక్సినేషన్ అవసరముందనే అంశంపై స్పష్టత వచ్చింది.
వ్యాక్సిన్ల పట్ల కొంతమందిలో ఆందోళన నెలకొంది. నిజంగా టీకా హానికరమా?
రాకేశ్ మిశ్రా: టీకా ఏమాత్రం హానికరం కాదు. సమాచార లోపంతోనే ఇలా జరుగుతోందని భావిస్తున్నా. ఇప్పటివరకు సుమారు 20 లక్షల మందికిపైగా టీకా వేయించుకున్నారు. ఎవరికి ఏమీ కాలేదు. ఒకట్రెండు ఘటనలు జరిగినా.. వాటికి ఇతర కారణాలున్నాయి. కొందరికి దీర్ఘకాలిక వ్యాధులు ఉండటం వల్ల అలా జరిగి ఉండొచ్చు. మనకు అందుబాటులో ఉన్న సమాచారం.. మొదటి, రెండు విడతల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా చూస్తే టీకా చాలా సురక్షితమైనది. అయితే అది వైరస్ నుంచి మనల్ని ఎంతకాలం రక్షిస్తుందనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రజలు మాస్కు తప్పనిసరిగా ధరించాలి.
ఇవీ చదవండి...
‘కొత్తరకం’పై ఆందోళన వద్దు..! సీసీఎంబీ
అగ్రరాజ్యానికి ‘కొత్తరకం’ కలవరం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా