పాక్ గెలిస్తే సంబరాలా..? దేశద్రోహం కేసు పెడతాం: యూపీ సీఎం హెచ్చరిక
ఇటీవల టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో టీమిండియాపై పాకిస్థాన్ జట్టు విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నవారిపై ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఉక్కు.........
లఖ్నవూ: ఇటీవల టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో టీమిండియాపై పాకిస్థాన్ జట్టు విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నవారిపై ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అలాంటి వారిపై దేశద్రోహం కేసులు మోపుతామని హెచ్చరించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం గురువారం ఉదయం ట్వీట్ చేసింది. ఇటీవల మ్యాచ్లో భారత్పై పాక్ విజయంపై ఆగ్రాలోని రాజా బల్వంత్ సింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న ముగ్గురు కశ్మీర్ విద్యార్థులు సంబరాలు జరుపుకోగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు. మత ప్రాతిపదికన గ్రూపుల మధ్య వైరాన్ని, సైబర్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ వారిపై అభియోగాలు మోపారు. ఈ ముగ్గురూ దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది.
ఆ నిందితులపై కోర్టు బయట దాడి..
కశ్మీర్కు చెందిన ముగ్గురు బీటెక్ విద్యార్థులను పోలీసులు ఆగ్రా కోర్టులో హాజరు పరిచారు. అనంతరం వారిని బయటకు తీసుకొస్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు దాడి చేశారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వాళ్లను రక్షించే ప్రయత్నం చేసినట్టు వీడియోలో రికార్డు అయింది. భారత్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అరెస్టును ఖండించిన ముఫ్తీ..
ఈ అరెస్టులను పీడీపీ అధ్యక్షురాలు, కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సహా కొందరు కశ్మీర్ నేతలు ఖండిస్తున్నారు. తమ రాష్ట్రంలో, బయట ప్రాంతాల్లో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు, ఈ ముగ్గురు విద్యార్థులను కళాశాల సోమవారం సస్పెండ్ చేసింది. అయితే, ముఫ్తీది తాలిబన్ మనస్తత్వమని పాక్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన వారికి జైలు తప్పదని కశ్మీర్ భాజపా అధ్యక్షుడు రవీందర్ రైనా విమర్శించారు.
రాజస్థాన్లోని జోధ్పూర్, పిప్పర్లో కొందరు పాక్ విజయంపై సామాజిక మాధ్యమాల్లో సంబరాలు చేసుకోగా.. స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అబ్దుల్ రషీద్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీంతో కోర్టు అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పాక్ జట్టు విజయాన్ని స్వాగతిస్తూ వాట్సాప్లో అభ్యంతరకర స్టేటస్ పెట్టిన ప్రైవేటు ఉపాధ్యాయురాలు నఫీషాను రాజస్థాన్లోని ఉదయ్పూర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తూ ఆమె వీడియో విడుదల చేయగా.. ఆమెకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. ఆమె పనిచేస్తున్న పాఠశాల ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. మరోవైపు, సామాజిక మాధ్యమాల్లో పాక్ విజయాన్ని స్వాగతిస్తూ వ్యాఖ్యలు చేసినవారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు ఓ వైపు వినిపిస్తుండగా.. మరోవైపు ఆటలో ఒక జట్టుకు మద్దతు ప్రకటించంలో తప్పేంటి అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?