Mamata Banerjee: ప్రపంచ శాంతి సదస్సుకు దీదీకి అనుమతి నిరాకరణ

కేంద్ర ప్రభుత్వానికి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి మధ్య మరో వివాదానికి తెరలేచిందా! అక్టోబరులో వాటికన్‌ సిటీలో నిర్వహించనున్న ‘ప్రపంచ శాంతి సదస్సు’లో పాల్గొనేందుకు మమతాకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమతులు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది...

Updated : 26 Sep 2021 01:49 IST

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వానికి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి మధ్య మరో వివాదం ఏర్పడింది. అక్టోబర్‌లో వాటికన్‌ సిటీలో నిర్వహించనున్న ‘ప్రపంచ శాంతి సదస్సు’లో పాల్గొనేందుకు మమతకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమతి నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది.

మదర్ థెరిస్సా జీవితం, సేవాకార్యక్రమాలే ప్రధాన అంశంగా సాగనున్న ఈ సదస్సుకు జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, పోప్ ఫ్రాన్సిస్, ఇటలీ ప్రధాని మారియో డ్రాగి తదితరులు హాజరుకానున్నారు. ఈ మేరకు మమతకు గతంలో రోమ్‌లోని కేథలిక్ అసోసియేషన్‌ నుంచి ఆహ్వానం అందింది. అనుమతుల నిరాకరణ వ్యవహారంపై టీఎంసీ అధికార ప్రతినిధి దేబాంగ్షు భట్టాచార్య దేవ్ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘దీదీ రోమ్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. గతంలో చైనా పర్యటనకూ అనుమతులు రద్దు చేశారు. అంతర్జాతీయ సంబంధాలు, భారత్‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మేం ఆ నిర్ణయాన్ని అంగీకరించాం. కానీ, ఇప్పుడు ఇటలీ కూడా ఎందుకు మోదీ జీ? బెంగాల్‌తో మీ సమస్య ఏంటి?’ అని ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని