17 ఏళ్ల వారికీ టీకా.. కేంద్రం చెప్పిందన్న అసోం సీఎం
రాష్ట్రంలో 17 ఏళ్ల వయసున్న వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ అన్నారు. కేంద్రం ఆ మేరకు సూచనలు చేసిందని చెప్పారు.
గువాహటి: రాష్ట్రంలో 17 ఏళ్ల వయసున్న వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ అన్నారు. కేంద్రం ఆ మేరకు సూచనలు చేసిందని చెప్పారు. కాబట్టి 17 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుంటేనే మహమ్మారి మరోసారి విజృంభించకుండా ఉంటుందన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్రం నుంచి కొత్త ఆదేశాలు వచ్చాయి. 17 ఏళ్లు పైబడి వారు కూడా ఇకపై కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కాబట్టి, 17, 18 ఏళ్లు మధ్య వయసున్న బాలబాలికలు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి’’ అని హిమంత పేర్కొన్నారు.
దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి టీకాలు 18 ఏళ్లు పైబడిన వారికే వేస్తున్నారు. 12-18 ఏళ్లు వారికి జైడస్ క్యాడిలా రూపొందించిన సూది అవసరం లేని జైకోవ్-డి టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఉన్నాయి. అయితే ఆ వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. చిన్నారులకు టీకా విషయంలో ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 17 ఏళ్లు వయసు వారూ వ్యాక్సిన్ వేసుకోవచ్చని హిమంత పేర్కొనడం గమనార్హం. 2020 నవంబర్ నుంచి 2021 ఫిబ్రవరి వరకు తగ్గినట్లే తగ్గిన కొవిడ్.. మళ్లీ విజృంభించిన విషయాన్ని హిమంత గుర్తుచేశారు. కాబట్టి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్