Govt Ads: ఐదేళ్లలో కేంద్రం ప్రకటనల ఖర్చు రూ.3723 కోట్లు
ప్రభుత్వ విధానాలు, వివిధ కార్యక్రమాల ప్రచారం కోసం గడిచిన ఐదేళ్లలో రూ.3723 కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. గత కొంత కాలంగా ఈ ఖర్చును ప్రభుత్వం పెంచడం లేదని రాజ్యసభ సభ్యులకు చెప్పారు.
దిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలు, వివిధ కార్యక్రమాల ప్రచారం (Advertisements) కోసం గడిచిన ఐదేళ్లలో రూ.3723కోట్లను ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ విభాగం ద్వారా వీటిని వినియోగించినట్లు తెలిపింది. రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
‘2017-18లో ప్రకటనల కోసం ప్రభుత్వం రూ.1220కోట్లు ఖర్చు చేయగా.. 2018-19లో రూ.1106కోట్లు వినియోగించాం. సార్వత్రిక ఎన్నికల తర్వాత 2019-20లో రూ.627కోట్లు ఖర్చు చేయగా.. 2021-21లో 349కోట్లు ప్రకటనల కోసం ఖర్చు పెట్టాం. ఇక 2021-22లో రూ.264 కోట్లు ప్రకటనలు, ప్రచారం కోసం వినియోగించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.15కోట్లను ఖర్చు చేశాం’ అని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు సయ్యిద్ నసీర్ హుస్సేన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. కొన్నేళ్లుగా ప్రకటనలు, ప్రచారం కోసం ప్రభుత్వం ఖర్చును పెంచలేదన్నారు.
భాజాపాయేతర రాష్ట్రాలే వ్యాట్ తగ్గించలేదు
పెట్రోలియం (Petroleum) ఉత్పత్తులపై భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే వ్యాట్ (VAT)ను తగ్గించలేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళతోపాటు ఝార్ఖండ్ రాష్ట్రాలు మాత్రమే పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించలేదని.. అందుకే ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించగా.. కొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయని చెప్పారు. ఇక ఇతర దేశాలతో పోలిస్తే భారత్లోనూ పెట్రోల్ ధర తక్కువగా ఉందన్న ఆయన.. ఆయా రాష్ట్రాలు పన్ను తగ్గించాలని విపక్ష పార్టీల ఎంపీలకు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్