Power Crisis: భానుడు భగ్గుమంటోన్న వేళ.. ముదురుతోన్న బొగ్గు సంక్షోభం..!
దేశవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతోన్న వేళ దిల్లీ, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, హరియాణా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను విద్యుత్ సంక్షోభం వేధిస్తోంది.
బొగ్గు నిల్వలు నిండుకున్నాయంటున్న రాష్ట్రాలు
దిల్లీ: దేశవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతోన్న వేళ పలు రాష్ట్రాలను విద్యుత్ సంక్షోభం కుదిపేస్తోంది. ముఖ్యంగా దేశరాజధాని దిల్లీతోపాటు ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, హరియాణా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే కరెంటు కోతలను మొదలుపెట్టాయి. ఇదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు లేవని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా దిల్లీలోని చాలా విద్యుత్ కేంద్రాల్లో కేవలం ఒక్కరోజుకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని హెచ్చరించింది. ఇటువంటి సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ ఎంతో అవసరమని సూచించింది.
దిల్లీలో నిండుకున్న నిల్వలు..
దేశవ్యాప్తంగా విద్యుత్కు సంబంధించిన పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని.. ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పరిష్కార మార్గాలు అన్వేషించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బొగ్గుకొరత తీవ్రంగా వేధిస్తోందని దిల్లీ విద్యుత్శాఖ మంత్రి సత్యేందర్ జైన్ పేర్కొన్నారు. ‘కరెంటు నిరంతరాయంగా ఉత్పత్తి అయితే ఎటువంటి సమస్య లేదు. కానీ, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడితే మాత్రం చాలా కష్టం. దేశంలో బొగ్గు కొరత ఉంది. విద్యుత్ కేంద్రాల్లో 21 రోజుల ఉత్పత్తికి సరిపడా నిల్వలు ఉండాలి. కానీ, చాలా విద్యుత్ కేంద్రాల్లో కేవలం ఒక్కరోజుకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి’ అని హెచ్చరించారు. ఈ సందర్భంగా కోల్ ఇండియా లిమిటెడ్కు రాష్ట్రాలు చెల్లింపులు చేయకపోవడం వల్లే బొగ్గు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని కేంద్రం చేస్తోన్న వాదనను సత్యేందర్ జైన్ తోసిపుచ్చారు.
రికార్డుస్థాయి వినియోగం..
కేవలం దిల్లీలోనే కాకుండా ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్, రాజస్థాన్, హరియాణా, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, బిహార్, యూపీ, ఏపీ రాష్ట్రాల్లో కరెంటు కష్టాలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. గురువారం ఒక్కరోజే 201గిగావాట్ల మార్కును దాటింది. ఇప్పుడే ఇలా ఉంటే మే- జూన్ సమయంలో ఈ డిమాండ్ 215-220 గిగావాట్లుగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ పరిస్థితిని పాజిటివ్గా చెబుతోన్న కేంద్ర ప్రభుత్వం.. దేశంలో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడం వల్లే విద్యుత్ వినియోగం ఈస్థాయిలో పెరిగినట్లు పేర్కొంది. కానీ, ఇదే సమయంలో డిమాండ్కు తగ్గట్లు సరఫరా చేయలేకపోతున్న రాష్ట్రాలు నిత్యం గంటలపాటు కరెంట్ కోతలు విధిస్తున్నాయి. ముఖ్యంగా బొగ్గు సరఫరా పెంచుకోకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి భారీగా చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.
విద్యుత్ సంక్షోభం కాదు.. చెల్లింపు సంక్షోభం..
దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడుతోందంటూ రాష్ట్రాలు చేస్తోన్న విమర్శలను కేంద్ర ప్రభుత్వం తిప్పికొడుతోంది. ప్రస్తుతం దేశంలో బొగ్గు సంక్షోభం లేదని.. ఇది కేవలం చెల్లింపు సంక్షోభమేనని కేంద్ర విద్యుత్శాఖ పేర్కొంటోంది. కోల్ ఇండియాకు సరిగా చెల్లింపులు చేయనందువల్లే బొగ్గు సరఫరాలో అంతరాయానికి కారణమని వెల్లడిస్తోంది. అయితే, చెల్లింపుల గురించి ఇరువైపుల అధికారిక ప్రకటన లేనప్పటికీ కోల్ ఇండియా మాత్రం బకాయిలు చెల్లింపులకు సంబంధం లేకుండా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తున్నామని చెబుతోంది. ఇలా బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న వేళ కేంద్ర, రాష్ట్రాలు మాత్రం విద్యుత్ సంక్షోభంపై విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM