Corona: థర్డ్ వేవ్ ముప్పు.. కేజ్రీవాల్ హెచ్చరిక!
కరోనా వైరస్ థర్డ్ వేవ్కు అవకాశాలు ఉన్నాయని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. కరోనా మహమ్మారిని యుద్ధ ప్రాతిపదికన ఎదుర్కొనేందుకు......
ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేనన్న దిల్లీ సీఎం
దిల్లీ: కరోనా వైరస్ థర్డ్ వేవ్కు అవకాశాలు ఉన్నాయని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. కరోనా మహమ్మారిని యుద్ధ ప్రాతిపదికన ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కరోనా మూడో ముప్పు భయాలపై యూకే నుంచి సంకేతాలు వస్తున్నాయని.. అక్కడ 45శాతం మేర వ్యాక్సినేషన్ జరిగినప్పటికీ కేసులు పెరుగుతున్నాయని వివరించారు. అందువల్ల, ఏమీ చేయకుండా తాము కూర్చోలేమన్నారు. శనివారం ఆయన దిల్లీలోని తొమ్మిది ఆస్పత్రుల్లో 22 కొత్త ఆక్సిజన్ ప్లాంట్ల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆన్లైన్ ఈవెంట్లో పాల్గొని మాట్లాడారు. ఈ కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు కరోనాపై పోరాటంలో ప్రభుత్వ సన్నద్ధతను మరింతగా బలోపేతం చేస్తాయన్నారు. దిల్లీ ప్రభుత్వం ఆక్సిజన్ ట్యాంకర్లను కూడా సేకరిస్తోందని తెలిపారు.
సెకండ్ వేవ్పై పోరాటంలో దిల్లీ ప్రజలు భుజం భుజం కలిపి ఐక్యంగా నిలబడ్డారని, పారిశ్రామిక రంగం కూడా ఈ పోరులో భాగస్వామిగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సెకండ్ వేవ్పై ఐక్యపోరాటం చేసిన దిల్లీ ప్రలజకు అభినందనలు తెలిపారు. వారి పోరాటం, క్రమశిక్షణ వల్లే కరోనా సెకండ్ వేవ్ను అదుపుచేయడంలో విజయం సాధించగలిగామన్నారు. థర్డ్వేవ్ రాకుండా ఉండాలని ప్రార్థిస్తున్నామని, ఒకవేళ వస్తే గనక మరోసారి ఐక్య పోరాటంతో ఎదుర్కొంటామన్నారు.
భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లలో దిల్లీ బిజీగా ఉందన్నారు. దిల్లీలోని వేర్వేరు చోట్ల తొమ్మిది ఆస్పత్రుల్లో మొత్తం 22 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభించినట్టు ట్విటర్లో తెలిపారు. వీటి ద్వారా 17.3 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. జులై మాసంలో మరో 17 ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పనున్నట్టు పేర్కొన్నారు. దిల్లీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనిచేస్తోందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.