
Published : 26 Jan 2022 18:58 IST
Chhattisgarh: ఇకపై అక్కడ ఉద్యోగులకు వారానికి 5రోజులే పని
రాయ్పుర్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఛత్తీస్గఢ్ సర్కారు తీపి కబురు అందించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారానికి 5 రోజులు మాత్రమే పనిదినాలు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతోపాటు ఉద్యోగుల పింఛన్లో కూడా సర్కారు వాటాను పెంచనున్నట్టు వెల్లడించింది. అన్ష్ దయి పెన్షన్ పథకంలో భాగంగా ప్రస్తుతం 10 శాతం ఇస్తున్న రాష్ట్ర సర్కారు వాటాను 14 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. వీటితోపాటు 2022-23 ఖరీఫ్ సీజన్కు సంబంధించి అన్ని పంటలు, తృణధాన్యాలను కనీస మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి
Tags :