Child Labour: బాలకార్మికులుగా 16కోట్ల మంది చిన్నారులు!
గత రెండు దశాబ్దాల కాలంలో మొదటిసారిగా బాల కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు యునిసెఫ్ నివేదిక వెల్లడించింది.
గత నాలుగేళ్లలోనే 84లక్షల మంది పెరుగుదల - యునిసెఫ్
వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా వ్యవస్థలన్నీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చిన్నారులపై ఇది ఎనలేని భారాన్ని మోపుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో గత రెండు దశాబ్దాల కాలంలో మొదటిసారిగా బాల కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. గడిచిన నాలుగేళ్లలోనే (2020 ప్రారంభం నాటికి) 84లక్షల మంది పిల్లలు కార్మికులుగా మారినట్లు తెలిపింది. తాజాగా కరోనా సంక్షోభం వల్ల 2022 చివరినాటికి మరో 90లక్షల మంది చిన్నారులు కార్మికులుగా మారే ప్రమాదముందని యునిసెఫ్ హెచ్చరించింది.
2020 సంవత్సరం ప్రారంభం నాటికి ప్రపంచవ్యాప్తంగా 16కోట్ల మంది చిన్నారులు బాలకార్మిక వ్యవస్థలో కూరుకుపోయినట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), ఐక్యరాజ్యసమితి పిల్లల విభాగం యునిసెఫ్ విడుదల చేసిన సంయుక్త నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా గడిచిన నాలుగేళ్లలోనే 84లక్షల మంది చిన్నారులు బాలకార్మికులుగా మారినట్లు అంచనా వేసింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభం కాకముందే ఈ పెరుగుదల ప్రారంభమైంది. 2000 నుంచి 2016 మధ్య కాలంలో 9.4కోట్లకు తగ్గిన బాల కార్మికుల సంఖ్య.. గడిచిన నాలుగేళ్లలోనే ఊహించని విధంగా పెరిగిందని తాజా నివేదికలో యునిసెఫ్ పేర్కొంది. ముఖ్యంగా ఐదు నుంచి 17ఏళ్ల వయసు కలిగిన పిల్లలు ప్రమాదకర పనుల్లో నిమగ్నం కావడం వారి విద్య, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
10మంది పిల్లల్లో ఒకరు..!
కొవిడ్ ప్రభావం ప్రారంభమైన తర్వాత బాల కార్మికుల సంఖ్య మరింత పెరుగుతునట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో ప్రతి పది మంది చిన్నారుల్లో ఒకరు బాలకార్మికులుగా మారుతున్నట్లు అంచనా వేసింది. ముఖ్యంగా ఆఫ్రికాలోని సహారా ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అభిప్రాయపడింది. సంక్షోభ సమయంలో ఆపదలో ఉన్న కుటుంబాలను సరైన విధంగా ఆదుకోకుంటే రానున్న రెండేళ్లలో మరో 5కోట్ల చిన్నారులు బాలకార్మిక వ్యవస్థలోకి జారుకునే ప్రమాదముందని హెచ్చరించింది.
‘ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లు, పాఠశాలలు మూతపడడం, ఆర్థిక వ్యవస్థల్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో కుటుంబాలు కఠిన నిర్ణయాలవైపు అడుగులు వేస్తున్నాయి. వారి పిల్లల్ని పనివైపు నడిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే పోరాటంలో తీవ్రంగా వెనకబడిపోతున్నాం’ అని యునిసెఫ్ చీఫ్ హెన్రైటా ఫోర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా ప్రభుత్వాలు తక్షణమే స్పందించి, ఈ సంక్షోభానికి పరిష్కార మార్గాలు చూపకపోతే రానున్న రోజుల్లో దారుణ పరిస్థితులకు కారణమవుతాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
ఎన్నికల బాండ్ల పథకం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చేసిన ప్రకటనను హస్తం పార్టీ ఖండించింది. -
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
DK Shivakumar: తన సోదరుడికి ఓట్లేస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది.
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?