china: ఇకపై చైనాలో ఆ పాటలు నిషేధం
సంగీత ప్రపంచంలో కారియోకీ పాటలకు అభిమానుల సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా బార్స్లో ఇలాంటి పాటలను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.
బీజింగ్: సంగీత ప్రపంచంలో కారియోకీ పాటలకు అభిమానుల సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా బార్స్లో ఇలాంటి పాటలను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. తాజాగా చైనా సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ కారియోకీ పాటలను చట్టవిరుద్ధంగా భావించి వాటిని నిషేధించింది. అక్టోబర్ 1 నుంచి వీటిని ప్రదర్శించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. చైనాలో వినోదాన్ని పంచే కారియోకీ అవుట్లెట్లు సుమారు 50వేలు ఉండగా.. ఇందులో లక్షకుపైగా పాటలను ప్రదర్శిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఆదేశాల మేరకు ఇవన్నీ మూతబడనున్నాయి. సాధారణంగా కారియోకీ ప్రదేశాల్లో ప్రదర్శించే పాటలకు అక్కడ పనిచేసే కంటెంట్ ప్రొవైడర్స్ బాధ్యత వహిస్తారు. ఇకపై ఈ పాటల స్థానంలో ఆరోగ్యకరమైన పాటలను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎందుకిలా అంటే..
చైనా జాతీయ ఐక్యత, సార్వభౌమత్వానికి హాని కల్పించేలా ఈ కారియోకీ పాటలు ఉన్నాయట. అంతేకాదు.. మతపరమైన విధానాలను ఉల్లంఘించడం, జూదం మాదకద్రవ్యాల వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉన్న కారణంగా వీటిని బ్లాక్లిస్ట్లో పెట్టింది ఈ డ్రాగన్ దేశం. ఇటీవల సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్స్లో హింస, పోర్న్ వీడియోలు, రాజకీయాలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలను తీవ్రంగా నిషేధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా