సైనిక మరణాలపై సందేహం.. బ్లాగర్పై చైనా వేటు!
గల్వాన్ ఘటనలో చైనా సైనికుల మరణాల సంఖ్యపై సందేహం వ్యక్తంచేసిన ఓ బ్లాగర్పై చైనా కేసు నమోదు చేసింది.
బీజింగ్: గల్వాన్ ఘటనలో చైనా సైనికుల మరణాల సంఖ్యపై సందేహం వ్యక్తంచేసిన ఓ బ్లాగర్పై చైనా కేసు నమోదు చేసింది. భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన చైనా సైనికులను అవమాన పరిచారనే అభియోగాలపై అతడిపై కేసు నమోదు చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఆ ఘటనలో కేవలం సాధారణ సైనికులు ప్రాణాలు కోల్పోగా, ఉన్నతాధికారి ప్రాణాలతో బయటపడడాన్ని ఈ యువకుడు ప్రశ్నించినందుకే చైనా అధికారులు అతడిపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపింది.
చైనాకు చెందిన కియూ జిమింగ్ (38) అనే యువకుడికి అక్కడి సామాజిక మాధ్యమం ‘వైబో’లో దాదాపు 25లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, గల్వాన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చైనా సైనికుల సంఖ్యపై సందేహాలు వ్యక్తం చేస్తూ అతడు రెండు పోస్టులు పెట్టాడు. గతేడాది జూన్లో జరిగిన గల్వాన్ ఘర్షణలో కమాండర్ స్థాయి అధికారి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.. ఉన్నతాధికారి కావడం వల్లనే అతడు బతకగలిగాడు అని తొలి పోస్టులో పేర్కొన్నాడు. అధికారులు వెల్లడించిన దానికంటే ఎక్కువ మంది చైనా సైనికులు ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చంటూ మరో పోస్టులో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. గల్వాన్ ఘర్షణలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఓ ఉన్నతాధికారికి తీవ్ర గాయాలు అయ్యాయని చైనా అధికారికంగా వెల్లడించిన తర్వాత కియూ జిమింగ్ ఈ విధంగా స్పందించాడు. దీంతో యువకుడి పోస్టులపై చైనా అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను వక్రీకరించి చైనా సైనికుల అపఖ్యాతికి కారణమయ్యారని ఆరోపిస్తూ అతడిపై తీవ్ర అభియోగాలు మోపినట్లు చైనా మీడియా వెల్లడించింది.
తూర్పు లాద్దాఖ్లో గతేడాది భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు వీరమరణం పొందినట్లు భారత్ అప్పుడే ప్రకటించింది. కానీ, చైనా మాత్రం వారి సైనికుల మరణాల సంఖ్యపై పెదవి విప్పలేదు. చివరకు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో ఆ ఘర్షణలో కేవలం నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు కొన్ని నెలల తర్వాత వెల్లడించింది. దీనిపై రష్యా మీడియా మాత్రం గల్వాన్ ఘటనలో దాదాపు 45 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఓ నివేదికలో పేర్కొంది. చైనా అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం కక్షగట్టి అణచివేస్తోందన్న వార్తలు గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!