China: భూటాన్ భూభాగంలో డ్రాగన్ పాగా.. డోక్లామ్ సరిహద్దుల వెంట ఇళ్ల నిర్మాణాలు
వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను అధీనంలోకి తీసుకొని శాశ్వతంగా పాగా వేయాలన్న కుట్రలకు చైనా పదను పెడుతూనే ఉంది.
భారత్ భద్రతకు సవాళ్లు
ఉపగ్రహ చిత్రాలతో రాయిటర్స్ కథనం
దిల్లీ: వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను అధీనంలోకి తీసుకొని శాశ్వతంగా పాగా వేయాలన్న కుట్రలకు చైనా పదను పెడుతూనే ఉంది. భారత్, చైనా సైనికుల మధ్య 2017లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న డోక్లామ్ సరిహద్దులోని భూటాన్ భూభాగంలో కట్టడాలను చురుగ్గా కొనసాగించడంతో పాటు అధిక సంఖ్యలో ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. డోక్లామ్కు 9 కి.మీ. నుంచి 27 కి.మీ పరిధిలోనే కొత్త నిర్మాణాలు ఉండడం గమనార్హం. మొత్తం ఆరు ప్రాంతాల్లో 200లకు పైగా కట్టడాల పనులు కొనసాగుతున్నాయని, వీటిల్లో రెండంతస్థుల భవనాలు కూడా ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ఆధారంగా ‘రాయిటర్స్’ వార్తా సంస్థ తాజాగా వెల్లడించింది. అమెరికాకు చెందిన డేటా అనలిటిక్స్ సంస్థ ‘హాక్ ఐ 360’ నుంచి ఈ సమాచారం తమకు అందినట్లు పేర్కొంది. చైనా కుయుక్తులు భారత్ భద్రతకు పెను సవాలు విసిరేలా ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తొలుత రోడ్లు.. ఆపై జనావాసాలు..
‘భూటాన్ సమీపంలో 2020 నుంచే చైనా నిర్మాణ పనులు చేపట్టింది. తొలుత ఆ ప్రాంతాల్లో రాకపోకలకు వీలుగా రోడ్లను నిర్మించింది. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేసింది. క్రమంగా వాటిని నివాస ప్రాంతాలుగా అభివృద్ధిపరిచింది. పలు వసతులతో గ్రామాలుగా తీర్చిదిద్ది అక్కడ ప్రజలు నివాసం ఉండేలా ప్రోత్సహిస్తోంది’ అని కపెల్లా స్పేస్ అండ్ ప్లానెట్ ల్యాబ్ తీసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమవుతోందని హాక్ఐ 360 డైరెక్టర్ క్రిస్ బిగ్గర్స్ వెల్లడించారు. మరో ఇద్దరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం...చైనా, భూటాన్ల మధ్య వివాదం కొనసాగుతున్న భూభాగంలో ఆరు కొత్త నివాస ప్రాంతాలు కనిపిస్తున్నాయి. 110 చదరపు కి.మీ. పరిధిలో ఇవి విస్తరించి ఉన్నాయి. తాజా నిర్మాణాలపై స్పందించేందుకు భూటాన్ నిరాకరించింది. ‘సరిహద్దు వివాదాలపై బహిరంగంగా మాట్లాడడం మా విధానం కాదు’ అని భూటాన్ విదేశీవ్యవహారాల శాఖ సమాధానమిచ్చింది. ‘భూటాన్తో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని బలప్రయోగం ద్వారా పరిష్కరించుకోవాలన్న చైనా విస్తరణ కాంక్షను ప్రస్తుత నిర్మాణాలు ప్రతిబింబిస్తున్నాయ’ని పేర్లు వెల్లడించడానికి నిరాకరించిన భారత రక్షణ వ్యవహారాల నిపుణులు వ్యాఖ్యానించినట్లు రాయిటర్స్ పేర్కొంది.
డ్రాగన్ వ్యూహం ఇదే..
మూడు దేశాల కూడలి ప్రాంతం డోక్లామ్కు సమీపంలో నిర్మిస్తున్న గ్రామాల వల్ల చైనాకు వ్యూహాత్మక ప్రయోజనాలు లభించనున్నాయని నిపుణులు వెల్లడించారు. భారత్, భూటాన్లపై మరింత స్పష్టంగా నిఘాను కొనసాగించడానికి, అవసరమైతే అత్యంత వేగంగా భద్రత బలగాలను వివాదాస్పద సరిహద్దులకు తరలించడానికి కొత్త ఆవాసాలు ఉపయోగపడతాయని తెలిపారు. 2017లో రెండు దేశాల సైనికుల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న డోక్లామ్ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఇవి ఉన్నాయన్నారు. టిబెట్ అటానమస్ రీజియన్(వివాదాస్పద భూభాగంలో చైనా వైపున్న ప్రాంతం)లో 600 గ్రామాలను నిర్మించాలని చైనా గతంలోనే ప్రణాళిక రచించిందని, దానిని దశల వారీగా అమలుచేస్తోందని రక్షణ అధ్యయనాల నిపుణుడు ఒకరు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్లో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగనా సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్