China: డ్రాగన్ కుయుక్తులు.. సరిహద్దుల్లో భారీ నిర్మాణాలు!
భారత్కు పాక్ కంటే చైనాతోనే అసలైన ముప్పుందన్న నిపుణుల హెచ్చరికలను నిజం చేస్తూ సరిహద్దుల్లో డ్రాగన్ కుయుక్తులకు పాల్పడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్కు పాక్ కంటే చైనాతోనే అసలైన ముప్పుందన్న నిపుణుల హెచ్చరికలను నిజం చేస్తూ సరిహద్దుల్లో డ్రాగన్ కుయుక్తులకు పాల్పడుతోంది. ఓ వైపు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా సరిహద్దుల్లో భారీ నిర్మాణాలు చేపడుతోంది. తూర్పు లద్దాఖ్ వెంబడి రహదారులు సహా భారీ సైనిక నిర్మాణాలు చేపడుతూ భారత్ను చైనా పదే పదే కవ్వింపులకు గురిచేస్తోంది. చైనా ఎన్ని కుయుక్తులు పన్నినా ఎదుర్కొనేందుకు రెట్టింపు సన్నద్ధతతో ఉన్నట్లు భారత ఆర్మీ వెల్లడించింది.
తూర్పు లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాలలోని సరిహద్దుల విషయంలో భారత్, చైనా మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గల్వాన్ ఘటనతో ఈ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తలెత్తింది. అయితే ఇరు దేశాల సైన్యాధికారుల చర్చలతో పరిస్థితులు కొంతమేర సద్దుమణిగినప్పటికీ.. పూర్తిగా సమసిపోలేదు. భారత్తో వివాదాల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు చైనా సైనిక నిర్మాణాలు చేపట్టడం.. భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధ సమయాల్లో భారీ ఎత్తున సైన్యాన్ని సరిహద్దులకు చేరవేసేందుకు వీలుగా తూర్పు లద్దాఖ్లో పెద్ద ఎత్తున సైనిక నిర్మాణాలను చైనా చేపడుతోంది. తూర్పు లద్దాఖ్కు ఆవల ఉన్న తమ భూభాగంలో చైనా రహదారులను నిర్మిస్తోంది. వాటిని ఇతర ప్రాంతాలకు అనుసంధానించడం ద్వారా యుద్ధ సమయాల్లో వేగంగా ఆయుధాలు, సైన్యాన్ని తరలించేందుకు వీలవుతుందని చైనా భావిస్తోంది. క్షిపణి రెజిమెంట్లను వేగంగా చేర్చేందుకు ఈ నిర్మాణాలను డ్రాగన్ చేపట్టినట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. కష్గర్, గర్గున్సా, హోటన్ సైనిక స్థావరాల వద్ద రహదారులను విస్తరించడంతోపాటు.. అక్కడ ఎయిర్ స్ట్రిప్స్ను సైతం నిర్మిస్తున్నట్టు పేర్కొన్నాయి.
గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది మరింత సన్నద్ధతతో శీతాకాలాన్ని ఎదుర్కొనేందుకు చైనా ఆర్మీ సిద్ధమైంది. అతి శీతల ప్రాంతాల్లో షెల్టర్లను నిర్మించడంతోపాటు.. రోడ్లను నిర్మించడం ద్వారా ఆ ప్రదేశాలను ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేసింది. సరిహద్దుల్లో డ్రోన్ల వినియోగాన్ని చైనా గణనీయంగా పెంచినట్టు భారత సైన్యం తెలిపింది. ఎక్కువ విస్తీర్ణంలో నిఘా కోసం డ్రోన్లను మోహరించినట్టు చెప్పింది. భారత సరిహద్దులకు చైనా భారీగా బలగాలను తరలించినట్టు వివరించింది.
సరిహద్దుల్లో చైనా ఎన్ని కుయుక్తులకు పాల్పడినా.. ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉన్నట్టు ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. గతేడాది కంటే మెరుగైన ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్టు సైన్యం వెల్లడించింది. డ్రాగన్కు తగిన రీతిలో సమాధానం చెబుతామని ధీమా వ్యక్తం చేసింది. పాక్ సరిహద్దుల వెంబడి సైతం భారత సైన్యం అప్రమత్తంగా ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. సరిహద్దుల్లో అతిశీతల పరిస్థితులు ఎదుర్కోనున్న నేపథ్యంలో బలగాలను మరింత బలోపేతం చేసేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు సైన్యం పేర్కొంది.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1700 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!