Tibetan unit: హఠాత్తుగా మేలుకొన్న చైనా..!
‘‘గల్వాన్, ఇతర ఘర్షణల తర్వాత వాస్తవాధీన రేఖ వెంట ఉన్న చైనా దళాల్లో కీలక మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఆ ఘర్షణల తర్వాత మెరుగైన శిక్షణ, సన్నద్ధత అవసరమనే నిజం వారికి తెలిసొచ్చింది.
భద్రతా దళాల్లోకి టిబెట్ వాసుల నియామకాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
‘‘గల్వాన్, ఇతర ఘర్షణల తర్వాత వాస్తవాధీన రేఖ వెంట ఉన్న చైనా దళాల్లో కీలక మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఆ ఘర్షణల తర్వాత మెరుగైన శిక్షణ, సన్నద్ధత అవసరమనే నిజం వారికి తెలిసొచ్చింది. అక్కడ సైనికులుగా సాధారణ పౌరులను తీసుకొంటారు. వారు స్వల్పకాలానికి మాత్రమే పనిచేస్తారు. దీంతో ఇలాంటి పర్వత ప్రాంతాల్లో విధి నిర్వహణకు చైనా ఇచ్చే శిక్షణ సరిపోదు. టిబెట్ భౌగోళికంగా చాలా కష్టమైంది. ఇక్కడ పని చేయాలంటే ప్రత్యేక శిక్షణ ఉండాలి. వాతావరణానికి అలవాటు పడాలి’’ అంటూ ఇటీవల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే. ఈ విషయం చైనాకు గల్వాన్లో 16వ బిహార్ రెజిమెంట్, కైలాస్ రేంజ్లో స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఇచ్చిన షాక్లతో అర్థమైంది. కైలాస్ రేంజి శిఖరాల స్వాధీనం ఆపరేషన్లో పాల్గొన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్లో ఉన్నవారు చాలా వరకు టిబెట్ నుంచి వలస వచ్చినవారే. ఆగస్టు 29 రాత్రి మెరుపు వేగంతో శిఖరాలను స్వాధీనం చేసుకొన్న తీరుకు చైనా బలగాలు బిత్తరపోయాయి. ఇప్పుడు వీలైనంత వరకు పర్వత ప్రాంతాలకు అలవాటు పడినవారినే తీసుకొనేందుకు చైనా వేగంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
నిరుద్యోగ టిబెట్ యువకులతో..
టిబెట్లోని నిరుద్యోగ యువకులతో ‘వాలంటీర్ మిలీషియా’ను చైనా ఏర్పాటు చేస్తోంది. సిక్కిం సరిహద్దుల వెంట వీరిని నియమిస్తోందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇరు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సిక్కిం సమీపంలో ఉన్న యడాంగ్ కౌంటీలోని పోలీస్ శాఖ ఈ యువకులను రిక్రూట్ చేసుకొంటోంది. వీరిని పోలీస్, సైనిక కేంద్రాల్లో శిక్షణ నిమిత్తం తరలిస్తున్నారు. చైనా ఈ యువకులను సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన గ్రామాల చెక్పోస్టుల వద్ద విధుల్లో నియమించనుంది. అంతేకాదు, సరిహద్దుల్లో నిఘా సమాచారం తెలుసుకోవడం, అవసరమైతే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) విధులు కూడా నిర్వహించేలా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో స్పెషల్ టిబెటియన్ ఆర్మీ యూనిట్ ఏర్పాటుకు ఏప్రిల్ నుంచి నియామకాలు చేపట్టింది.
చుంబీ వ్యాలీలో తొలి యూనిట్
పీఎల్ఏ సిద్ధం చేసిన తొలి యూనిట్ను చుంబీవ్యాలీలో నియమించారు. మొత్తం ఒక్కోదానిలో 100 మంది సభ్యులతో రెండు బృందాలు విధుల్లో చేరాయి. శిక్షణ అనంతరం వీరిని టిబెట్లో భౌద్ద సన్యాసుల వద్దకు తీసుకెళ్లి ఆశీర్వాదం ఇప్పించారు. వాస్తవానికి పీఎల్ఏ ఎప్పుడూ ఇలా చేయదు. కానీ ఈ సారి కొత్తగా చేరినవారి మతపరమైన సెంటిమెంట్లను గౌరవించింది. ఇది కూడా టిబెట్ వాసుల నమ్మకం సంపాదించుకొనే వ్యూహంగా అనుమానిస్తున్నారు. ఈ కొత్త బ్యాచులను చుంబీ వ్యాలీలోని యటుంగ్, చీమ, రించెన్గాంగ్, పీబీ థాంగ్, పహారి ప్రాంతాల్లో నియమిస్తారు. వీరందరూ స్పెషల్ టిబేటియన్ ఆర్మీ యూనిట్ కిందకు వస్తారు. వీరికి ఇక్కడి భౌగోళిక స్థితి, వాతావరణం, వనరులు వంటి వాటిపై ఎక్కువ అవగాహన ఉండటం కలిసొచ్చే అంశం.
పీఎల్ఏ బలహీనతే అది..
అతి శీతల పరిస్థితుల్లో పని చేయడం పీఎల్ఏ సైనికులకు పెద్దగా అలవాటు లేదు. ఇటీవల సీడీఎస్ బిపిన్ రావత్ చెప్పింది కూడా అదే. ఈ చలిలో గాయాలు కాకూడదు. పొరబాటున లోహాలను చేతులతో పట్టుకుంటే గాయపడక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో అక్యూట్ మౌంటెన్ సిక్నెస్, హైఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడిమా వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చైనా సైనికులు ఆక్సిజన్ అందించే ప్రత్యేక గదుల్లో ఉంటారు. చైనా వారిని చలి వాతావరణానికి అలవాటు పడనివ్వలేదు. 2,500 నుంచి 3,000 మీటర్ల కంటే ఎత్తయిన ప్రదేశాల్లో అడుగుపెట్టే కొద్దీ గాలి ఒత్తిడి తగ్గి, వాతావరణంలోని ఆక్సిజన్ 30శాతం వరకు పడిపోతుంది. చైనా సైన్యంలో చాలామంది కాలేజీ విద్యార్థుల వయస్సువారే ఉండటం.. ఈ వాతావరణానికి తగిన శిక్షణ లేకపోవడం.. అలవాటు పడేలోపే వారిని మార్చేయడం.. ఇలాంటి కారణాలతో కుదురుకోలేకపోతున్నారు. దీంతో ఈ బలహీనతను అధిగమించేందుకు ఇప్పుడు ఆ దేశం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?