అరుణాచల్లో చైనా హల్చల్
పొరుగు దేశ భూభాగాల ఆక్రమణ పర్వాన్ని చైనా యథేచ్ఛగా కొనసాగిస్తోంది.
101 ఇళ్లతో గ్రామం నిర్మాణం
4.5 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొరబాటు
ఉపగ్రహ చిత్రాల్లో బట్టబయలు
గమనిస్తూనే ఉన్నాం: కేంద్రం
దిల్లీ: పొరుగు దేశ భూభాగాల ఆక్రమణ పర్వాన్ని చైనా యథేచ్ఛగా కొనసాగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా ఒక గ్రామాన్ని కూడా డ్రాగన్ నిర్మించినట్లు తాజాగా వెల్లడైంది. ఈ క్రమంలో 4.5 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. ఆ గ్రామంలో 101 ఇళ్లు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది భారత్కు ఆందోళనకర అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగువ సుభాన్సిరి జిల్లాలో సారి చు నది ఒడ్డున ఈ గ్రామం వెలిసింది. ఈ ప్రాంతంపై భారత్, చైనాల మధ్య వివాదం ఉంది. గతంలో ఇక్కడ యుద్ధం కూడా జరిగింది. గత ఏడాది నవంబరు 1న తీసిన ఉపగ్రహ చిత్రంలో ఈ గ్రామం కనిపించింది. 2019 ఆగస్టులో అది లేదు. ఆ ప్రాంతంలో చైనా సైనిక శిబిరానికి కొద్దిదూరంలో ఈ గ్రామం ఉంది. ఆ శిబిరాన్ని కూడా గత దశాబ్ద కాలంలో గణనీయంగా ఆధునికీకరించారు.
తమ దృష్టికి వచ్చింది: భారత్
సరిహద్దు ప్రాంతాల్లో చైనా కొన్ని నిర్మాణాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారత ప్రభుత్వం పేర్కొంది. తాము కూడా సరిహద్దుల్లో మౌలిక వసతులను మెరుగుపరచుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నట్లు పేర్కొంది. వీటివల్ల స్థానికులకూ ప్రయోజనం చేకూరుతుందని వివరించింది. దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ చేపడుతున్నట్లు పేర్కొంది. సరిహద్దు ప్రాంతంలో భారత్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు సైనిక మోహరింపులనూ పెంచుతోందని గత ఏడాది అక్టోబరులో చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. కొన్ని నెలలుగా సాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలకు ఇదే ప్రధాన కారణమని పేర్కొంది. అయితే తాజా గ్రామానికి చుట్టుపక్కల ఎక్కడా భారత రోడ్లు, ఇతర మౌలిక వసతులు లేకపోవడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన భాజపా ఎంపీ తాపిర్ గావో కూడా గత ఏడాది నవంబరులో ఈ అంశాన్ని లోక్సభలో లేవనెత్తారు. చైనా తమ రాష్ట్రంలోకి చొరబాట్లు సాగిస్తోందని ఆరోపించారు. డబుల్లేన్ రోడ్డును నిర్మిస్తోందని తాజాగా ఆయన పేర్కొన్నారు. నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. నది వెంబడి పరిశీలనలు సాగిస్తే 60-70 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు స్పష్టమవుతోందని తెలిపారు. లెన్సి అనే ఒక నది పక్కన రోడ్డును నిర్మిస్తోందని చెప్పారు.
ఇవీ చదవండి...
ట్రంప్ ఆంక్షల్ని ఎత్తేశారు.. బైడెన్ కుదరదన్నారు!
కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే