actress Zhao Wei: చైనా అనుమానిస్తే చరిత్రలో కూడా ఉండనీయదు..!
చైనా ఇటీవల వ్యక్తుల, సంస్థల కీర్తి ప్రతిష్ఠలను అంచనావేసి మరీ అణగదొక్కుతోంది. కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థను మించిపోతారనుకుంటే నిర్దాక్షిణ్యంగా వారిని కనుమరుగు చేస్తోంది.
సినీనటిపై ప్రతాపం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనా ఇటీవల వ్యక్తుల, సంస్థల కీర్తి ప్రతిష్ఠలను అంచనా వేసి మరీ అణగదొక్కుతోంది. కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థను మించిపోతారనుకుంటే నిర్దాక్షిణ్యంగా వారిని కనుమరుగు చేస్తోంది. ఇటీవల బిలియనీర్ జాక్ మా ఒక్కసారిగా అదృశ్యమైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా ఒక బిలియనీర్ నటీమణిపై కత్తిగట్టింది. చైనా ఇంటర్నెట్ ప్రపంచంలో ఆమెను కనుమరుగు చేసే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. సమాజం మొత్తం ఆమెను మరిచిపోయేట్లు చర్యలు చేపట్టింది. చైనాకు చెందిన నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ అడ్మిన్స్ట్రేషన్ కొరడా తీసుకొని బయల్దేరింది. అన్ని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లపై నుంచి ఆమె చిత్రాలు, వెబ్సిరీస్లను తొలగించే పని చేపట్టింది.
ఎవరా నటి..?
చైనాలో విక్కీ ఝావోగా పేరు తెచ్చుకున్న ఝావో వీ అనే నటిపై ప్రభుత్వం కత్తిగట్టింది. ఆమె 1990ల్లో విడుదలైన ‘మై ఫెయిర్ ప్రిన్సెస్’ అనే కామెడీ సిరీస్తో బాగా పాపులర్ అయింది. 18వ శతాబ్ధానికి చెందిన క్వింగ్ వంశంపై దీనిని చిత్రీకరించారు. ఒక అనాథ అనుకోని పరిస్థితుల్లో యువరాణి ఎలా అయిందనేదే ఈ సిరీస్. దీని తర్వాత ఆమె పాపులారిటీ పెరిగిపోవడంతో సినీరంగలోకి అడుగుపెట్టింది. ‘షావాలిన్ సాకర్’ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత చైనాలో సూపర్స్టార్గా ఎదిగింది. 2020లో కూడా ఫ్యాషన్ బ్రాండ్లు, ఫెండీ, బర్బెర్రీలు ఆమెను ప్రచారకర్తగా నియమించుకొన్నాయి.
ఆమె తన పాపులారిటీని సంపద మరింత విస్తరించేందుకు వాడుకొంది. ఆమె భర్త హువాంగ్ యూలాంగ్ 400 మిలియన్ డాలర్లను అలీబాబా పిక్చర్స్లో పెట్టుబడిగా పెట్టారు. అలీబాబా పిక్చర్స్లో రెండో అతిపెద్ద భాగస్వామి ఆమె కుటుంబమే. 2016లో అత్యంత పిన్నవయస్కులైన బిలియనీర్ల జాబితాలో ఆమె భర్త యూలాంగ్ స్థానం పొందాడు.
జిన్పింగ్ గురిలోకి ఎందుకొచ్చింది..?
చైనాకు చెందిన నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ అడ్మిన్స్ట్రేషన్(ఎన్ఆర్టీఏ) ఇటీవల హఠాత్తుగా ఝావోకు చెందిన కార్యక్రమాలు, సినిమాలు, ఇతర అంశాలను వెబ్ సైట్ల నుంచి తొలగించాలని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లను ఆదేశించింది. దీనికి కచ్చితమైన కారణాలను మాత్రం వెల్లడించలేదు. కానీ పలు అంశాలను మాత్రం తెరపైకి వచ్చాయి.
* 2016లో ఝావో సంస్థ ఒక తైవాన్ నటికి ప్రధాన పాత్ర ఇచ్చి చిత్రాన్ని నిర్మించడం విమర్శల పాలైంది.
* ఆమె వ్యాపార సంస్థల విస్తరణతో రెగ్యులేటరీల దృష్టిలో పడ్డారు.
* ఆమెకు చెందిన పబ్లిక్ రిలేషన్స్ కంపెనీ క్లైయింట్ అయిన నటుడు ఝాంగ్ జెహాన్ ఒక వివాదంలో చిక్కుకున్నారు. జపాన్లోని ‘యుసుకుని యుద్ధ స్మారకం’ వద్ద అతను ఫొటో దిగాడు. అది చైనాపై యుద్ధం చేసిన జపాన్ దళాల స్మారకం కావడంతో వివాదాస్పదమైంది.
* అలీబాబా సంస్థల్లో ఆమెకు పెట్టుబడులు ఉండటం ఓ ప్రధాన కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల షీ జిన్పింగ్ సూచనలతో అలీబాబా సామ్రాజ్యంపై చైనా అధికారులు విరుచుకుపడిన విషయం తెలిసిందే. గతంలో అలీబాబాపై అధికారులు చర్యలు తీసుకొన్నప్పుడు కూడా కచ్చితమైన కారణం తెలియలేదు. కేవలం అతను బ్యాంకులను విమర్శించాడనే చేసినట్లు చాలా మంది భావించారు.
తాజా చర్యలతో ఝావో ఫ్రాన్స్ పారిపోయినట్లు పుకార్లు వచ్చాయి. కానీ, తాను బీజింగ్లోనే ఉన్నట్లు ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది.
గతంలో ఓ మహిళా సూపర్ స్టార్ అదృశ్యం..!
నటీనటులపై విరుచుకుపడటం చైనాకు ఇదే కొత్తకాదు. 2018లో అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకొంటున్న నటి ఫాన్ బింగ్బింగ్ను కూడా అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. 2018లో జులై ఆమె ఉన్నట్లుండి అదృశ్యమయ్యారు. ఆమె సోషల్ మీడియా పేజీల్లో ఎటువంటి సమాచారం లేదు. చివరికి కుటుంబ సభ్యులు, మిత్రులకు కూడా ఆమె ఎక్కడ ఉందో ఆచూకీ తెలియలేదు. అక్టోబర్లో ఆమె బాహ్యప్రపంచానికి కనిపించారు. ఫాన్ పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు భావించిన అధికారులు ఆమెను అరెస్టు చేశారు. దీంతో 127 మిలియన్ డాలర్ల ఫైన్ ఆమెకు విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్