China - US: ఏదో ఒకరోజు అమెరికాపై చైనా అణుదాడి..!
అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. వాణిజ్య ఒప్పందం, దక్షిణ చైనా సముద్రం, కరోనా మహమ్మారి.. ఇలా చాలా అంశాలపై ఇరు దేశాలు చాలా సార్లు బహిరంగంగానే మాటల
హెచ్చరించిన అమెరికా మిలిటరీ ఉన్నతాధికారి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. వాణిజ్య ఒప్పందం, దక్షిణ చైనా సముద్రం, కరోనా మహమ్మారి.. ఇలా చాలా అంశాలపై ఇరు దేశాలు చాలా సార్లు బహిరంగంగానే మాటల యుద్ధానికి దిగాయి. అంతేనా.. అత్యవసర పరిస్థితుల్లో అమెరికాను ఎదుర్కొనేందుకు డ్రాగన్ తన అస్త్రశస్త్రాలను కూడా సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే కొన్ని నెలల కిందట ఓ రహస్య క్షిపణి ప్రయోగాన్ని కూడా చేపట్టింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అమెరికాపై చైనా దాడికి సిద్ధమవుతుందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా అగ్రరాజ్య మిలిటరీ ఉన్నతాధికారి ఒకరు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు అమెరికాపై డ్రాగన్ అనూహ్య అణు దాడి జరపొచ్చని హెచ్చరించారు.
ఈ ఏడాది జులైలో చైనా అణ్వస్త్ర సామర్థ్యమున్న ఒక సరికొత్త హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. అది.. దిగువ భూ కక్ష్యలో పయనిస్తూ పుడమి మొత్తాన్ని చుట్టేసింది. ఆ తర్వాత కిందకి దిగి, శరవేగంగా లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. ఇది కొద్దిలో గురితప్పినా.. ప్రమాదకరమైన క్షిపణి రూపకల్పనలో డ్రాగన్ చాలా వరకూ పట్టు సాధించినట్లు తేటతెల్లమైంది. అయితే అత్యంత గోప్యంగా జరిపిన ఈ ప్రయోగం ఇటీవల బయటపడింది. దీనిపై అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వైస్ ఛైర్మన్ జనరల్ జానీ హేటెన్ మరిన్ని వివరాలను సేకరించారు.
‘‘గత ఐదేళ్లలో చైనా వందలాది హైపర్సోనిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. అమెరికా మాత్రం కేవలం 9 ప్రయోగాలే చేపట్టింది. ఇప్పటికే చైనా వద్ద మీడియం రేంజ్ హైపర్సోనిక్ ఆయుధం ఉంది. జులైలో ప్రయోగించిన క్షిపణి లాంగ్ రేంజ్ మిసైల్. వందలాది క్షిపణులను తయారు చేసుకుంటున్న చైనా.. ఏదో ఒక రోజు అమెరికాపై అనూహ్య అణ్వాయుధ దాడి జరిపే అవకాశం ఉంది’’ అని హేటెన్ హెచ్చరించారు. ఇటీవల పెంటగాన్ కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. డ్రాగన్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని శరవేగంగా పెంచుకుంటోందని, ఈ దశాబ్దం చివరి నాటికి ఆ దేశం వద్ద 1000 న్లూక్లియర్ వార్హెడ్లు ఉండొచ్చని అంచనా వేసింది.
ధ్వనితో పోలిస్తే కనీసం ఐదు రెట్లు వేగం (గంటకు 6,200 కిలోమీటర్లు)గా దూసుకెళ్లే అస్త్రాలను హైపర్సోనిక్ క్షిపణులుగా పేర్కొంటారు. ఇలాంటి క్షిపణినే చైనా ఇటీవల ప్రయోగించింది. భూమి చుట్టూ ఓ క్షిపణి ప్రయాణించడం ఇదే తొలిసారి. అయితే ఈ ప్రయోగాన్ని ధ్రువీకరించిన చైనా.. అది క్షిపణి కాదని, వ్యోమనౌక అని వెల్లడించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్