China: టిబెట్ వద్దరోబో సైన్యాన్ని మోహరించిన చైనా..!
చైనా సైన్యం శారీరకంగా అనుకున్నంత పటిష్ఠంగా లేదని జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. తాజాగా ఇక్కడ సైనికులు వాతావరణానికి తట్టుకోలేకపోతుండటంతో రోబోలను బరిలోకి దించింది.
ఎల్ఏసీ వద్ద పెరుగుతున్న మోహరింపులు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనా సైన్యం శారీరక దారుఢ్యంలో అనుకున్నంత పటిష్ఠంగా లేదని జరుగుతోన్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. తాజాగా ఇక్కడ సైనికులు వాతావరణానికి తట్టుకోలేకపోతుండటంతో రోబోలను బరిలోకి దించింది. ఈ విషయాన్ని పలు ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. డ్రోన్ల ద్వారా వేడివేడి ఆహారం పంపడం.. హీట్ ఛాంబర్ల చిత్రాలను ప్రచారం చేసుకోవడం ద్వారా తమ సైనికులు ఉన్న సౌకర్యాలను గొప్పగా చూపించుకొంది. కానీ, వాస్తవాలను పరిశీలిస్తే.. వారు అక్కడి శీతల పరిస్థితులను తట్టుకోలేకపోతున్నారు.
వాస్తవాధీన రేఖ వద్దకు చైనా మెషిన్ గన్ రోబోలను తరలించింది. అక్కడి అత్యంత ఎత్తైన పర్వత వాతావరణానికి చైనా సైనికులు తట్టుకోలేకపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఈ రోబోలు ఆయుధాలు ప్రయోగించడంతోపాటు.. సామగ్రిని కూడా తరలించగలవు.
చైనా మోహరించిన వాహనాల్లో ‘ది షార్ప్ క్లా’ అనే సాయుధ వాహనం ఉంది. దీనిపై లైట్ మెషిన్గన్ను అమర్చారు. రిమోట్ ద్వారా ఈ వాహనాన్ని ఆపరేట్ చేయవచ్చు. ఇలాంటివి 88 వాహనాలను టిబెట్కు తరలించగా.. ఇప్పటికే 38 ఎల్ఏసీ వద్ద మోహరించింది. చైనా ఆయుధ తయారీ సంస్థ నోరిన్కో వీటిని అభివృద్ధి చేసింది.
‘ది ముల్-200’ పేరిట పిలిచే మరో మానవరహిత వాహనం కూడా టిబెట్కు చేరింది. సరకు రవాణా చేయడం దీని ప్రధాన విధి. అవసరమైతే దీనిపై ఆయుధాలను కూడా అమర్చవచ్చు. ఇలా మొత్తం 120 వాహనాలను తరలించింది. వీటిల్లో చాలా వరకూ వాస్తవాధీన రేఖ వద్దకు చేరుకొన్నాయి. ఈ వాహనాలకు అదనంగా 70 వీపీ-22 వాహనాలను, 150 ఎల్వైఎన్ఎక్స్ వాహనాలను కూడా పంపింది. ఎల్వైఎన్ఎక్స్ వాహనంపై శతఘ్నులు, భారీ మెషిన్ గన్లు, మోర్టార్లు, చిన్న క్షిపణి లాంఛర్లలను అమర్చవచ్చు.. బలగాలను తరలించవచ్చు. వీపీ-22 వాహనంలో 15 మంది సైనికులను తరలించవచ్చు. అవసరమైతే అంబులెన్స్కు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు.
ఇప్పటికే టిబెట్లో ఉన్న కొందరు సైనికులకు సామర్థ్యాన్ని పెంచే ఎక్సోస్కెలిటన్ సూట్లను అందజేశారు. ఈ సూట్ హైఆల్టిట్యూడ్ యుద్ధ తంత్రంలో ఉపయోగపడుతుందని గ్లోబల్ టైమ్స్ గతంలో వెల్లడించింది.
అడుగడుగునా గండమే..
అతి శీతల పరిస్థితుల్లో పనిచేయడం సైనికులకు పలు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. అతిశీతల వాతావరణంలో లోహాలను చేతులతో పట్టుకుంటే గాయపడక తప్పని పరిస్థితి. దీంతో అక్యూట్ మౌంటేన్ సిక్నెస్, హైఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడీమా వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చైనా సైనికులను పూర్తిస్థాయిలో చలి వాతావరణానికి అలవాటు పడనివ్వడంలేదు. 2,500 నుంచి 3,000 మీటర్ల కంటే ఎత్తయిన ప్రదేశాల్లో అడుగుపెట్టే కొద్దీ గాలి ఒత్తిడి తగ్గి వాటిల్లో ఆక్సిజన్ 30శాతం వరకు పడిపోతుంది. ఫలితంగా తగినంత ప్రాణవాయువు అందదు. వేగంగా ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లేకొద్దీ శరీరం తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. దీనిని తట్టుకోవడానికి హపోబ్యాగ్ను వాడుతుంటారు. అక్కడి వాతావారణానికి అలవాటు పడటం ఒక్కటే మార్గం. 3వేల మీటర్లు దాటాక కొన్నాళ్లు అక్కడే ఉండి వాతావరణానికి అలావాటు పడాలి. ఇక 4వేల మీటర్ల ఎత్తు దాటిన తర్వాత ప్రతి 300 మీటర్ల ఎత్తుకు వెళ్లే కొద్దీ ఒక రాత్రి బస చేయాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సు ఢీకొని.. నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..