LAC: భారత సరిహద్దుల్లో బలపడిన డ్రాగన్ రెక్కలు..!
వాస్తవాధీన రేఖ వెంట చైనా భారీ ఆయుధాలను చేర్చింది. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సరిహద్దులకు తరలించింది. వెస్ట్రన్ సెక్టార్లో ఎల్ఏసీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపు దీర్ఘశ్రేణి శతఘ్నులు, రాకెట్ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతోపాటు రన్వేల అభివృద్ధి చేపట్టింది.
అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, భారీ రన్వేలు సిద్ధం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
వాస్తవాధీన రేఖ వెంట చైనా భారీ ఆయుధాలను చేర్చింది. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సరిహద్దులకు తరలించింది. వెస్ట్రన్ సెక్టార్లో ఎల్ఏసీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపు దీర్ఘశ్రేణి శతఘ్నులు, రాకెట్ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతోపాటు రన్వేల అభివృద్ధి చేపట్టింది. వీటితోపాటు ఫైటర్ జెట్లను భద్రపర్చేందుకు బ్లాస్ట్ప్రూఫ్ బంకర్ల నిర్మాణం కూడా చేపట్టింది. భారత్తో వివాదం మొదలైన రెండేళ్లలోనే వీటిని సిద్ధం చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనావేశాయి. ఈ విషయాన్ని కేంద్రంలోని కీలక అధికారులు ఓ ఆంగ్లపత్రికకు వివరించారు. ఇటీవల అమెరికా ఆర్మీ పసిఫిక్ కమాండ్ జనరల్ చార్లెస్ ఫ్లయాన్ కూడా భారత్ పర్యటన సమయంలో చైనా మోహరింపులపై ఆందోళన వ్యక్తం చేశారు.
1,20,000 సైనికుల కోసం నిర్మాణాలు..!
2020లో భారత్-చైనా ఘర్షణకు ముందు వాస్తవాధీన రేఖ వెంట పశ్చిమ సెక్టార్లో కేవలం 20,000 పీఎల్ఏ దళాలు మాత్రమే ఉండేలా నిర్మాణాలు ఉన్నాయి. కానీ, ఈ రెండేళ్లలో 1.2లక్షల మంది ఉండేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. దీంతోపాటు సౌరశక్తి, హైడల్ పవర్ ప్రాజెక్టులను పీఎల్ఏ దళాలు నిర్మించాయి. ముఖ్యంగా శీతాకాలంలో కూడా దళాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ నిర్మాణాలను ఏర్పాటు చేశారు.
కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్లుగా మార్పు..!
వాస్తవాధీన రేఖ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన షింజియాంగ్ డివిజన్ కిందకు వస్తుంది. ఇక్కడ మోహరించిన డివిజన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతోపాటు రొటేట్ చేస్తున్నారు. 2020లో వివాదం మొదలైన సమయంలో ఇక్కడ 4వ, 6వ డివిజన్లను మోహరించారు. 2021లో వాటిని మార్చేసి 8వ, 11వ డివిజన్లను ఇక్కడికి తరలించారు. ఈ ఏడాది 4వ, 8వ డివిజన్లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మొత్తం డివిజన్లను కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్లుగా మార్చే పని కూడా వేగంగా జరుగుతోంది. వీటి పరికరాలను ఈ రెండేళ్లలో పూర్తిగా మార్చేశారు.
దళాల చేతికి అత్యాధునిక ఆయుధాలు..!
ఇక్కడ దళాలు వాడే ఆయుధాలను చైనా పూర్తిగా మార్చేసి.. కొత్తవి ఇచ్చింది. గతంలో ఇక్కడ 4వ డివిజన్ జెడ్టీజెడ్-88 తొలి తరం ట్యాంకును వినియోగించేది. కానీ, ఇప్పుడు జెడ్టీక్యూ(టైప్-15) మూడో తరం ఆధునిక ట్యాంకులను తరలించారు. ఇక 6వ డివిజన్ గతంలో టైప్ 96ఏ రెండోతరం ట్యాంకులను వినియోగించేది. తాజాగా ఆ ట్యాంకుల ఫైర్ కంట్రోల్ వ్యవస్థలను చైనా పూర్తిగా అప్గ్రేడ్ చేసింది.
*ఇక్కడి మెకనైజ్డ్ బ్రిగేడ్లో దళాలను తరలించేందుకు గతంలో జెబీఎల్-08 వాహనాలను వాడేవారు. ఇప్పుడు వాటిని మార్చి జెడ్టీఎల్-11 వాహనాలను వినియోగిస్తున్నారు. ఇక 11వ డివిజన్లో సీఎస్కే సిరీస్ సాయుధ వాహనాలు వినియోగిస్తున్నారు. ఇవి అమెరికన్ల హమ్వీలను పోలి ఉంటాయి.
* అదే విధంగా వాస్తవాధీన రేఖ సమీపంలోని వైమానిక స్థావరాల్లో పేలుళ్లను తట్టుకొనేలా బ్లాస్ట్పెన్లను నిర్మించారు. షిగాడ్స్,రూడక్ స్థావరాల్లో హెలిపోర్టులు, గర్గున్స్, లాసా,గ్వాంగ్ఝూ స్థావరాల్లో రన్వేలను కూడా అభివృద్ధి చేశారు.
ట్రక్ మౌంటెడ్ శతఘ్నులు..!
చైనా సుదీర్ఘ శ్రేణి శతఘ్నులను వాస్తవాధీన రేఖ వద్దకు తరలించింది. గతంలో ఉన్న టోడ్ శతఘ్నులను తొలగించింది. ట్రక్కులపై అమర్చిన శతఘ్నులను అక్కడికి చేర్చింది. ఇవి 50 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. దాడి చేసిన వెంటనే శత్రువు గుర్తించే లోపు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోతాయి. అరుణాచల్ ప్రదేశ్వేపు కూడా వాస్తవాధీన రేఖకు 50 కిలోమీటర్ల లోపు భారీగా శతఘ్నులను మోహరించారు.
* 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే పీహెచ్ఎల్-3 మల్టీ రాకెట్ లాంఛ్ వ్యవస్థలను వాస్తవాధీన రేఖ వద్దకు చేర్చింది. వీటిని రష్యాకు చెందిన స్మెర్చి ఎంఆర్ఎల్ ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇటువంటివి భారత్ వద్ద మూడు రెజిమెంట్లు ఉన్నాయి.
* సరిహద్దుల సమీపంలో హెచ్క్యూ-17 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అమర్చింది. దీంతోపాటు చిప్చాప్ రిడ్జ్ వద్ద అత్యాధునిక హెచ్క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మోహరించింది. రష్యాకు చెందిన ఎస్-300 వలే ఇది పనిచేస్తుంది.
* హోటన్లో చైనా ప్రస్తుతం 25 ఫైటర్ జెట్లను మోహరించింది. సాధారణ స్థితి కంటే ఇది చాలా ఎక్కువ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు