China Vaccines: టీకాల సామర్థ్యంపై తొలిసారి నివేదిక!
కరోనా వైరస్ను నిరోధించడంలో చైనా తయారుచేసిన వ్యాక్సిన్లు సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రయోగ ఫలితాలు ప్రఖ్యాత అమెరికా మెడికల్ జర్నల్లో ప్రచురితమైంది. కరోనా వైరస్తో పాటు వ్యాక్సిన్ల పనితీరుపై గోప్యత పాటిస్తోన్న చైనా.. తొలిసారి వ్యాక్సిన్ ప్రయోగాల ఫలితాలను అంతర్జాతీయ జర్నల్కు నివేదించింది
అమెరికా జర్నల్లో ప్రయోగ ఫలితాలు
బీజింగ్: కరోనా వైరస్ను నిరోధించడంలో చైనా తయారుచేసిన వ్యాక్సిన్లు సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు వెల్లడైంది. దీనికి సంబంధించిన పూర్తి ప్రయోగ ఫలితాలు ప్రఖ్యాత అమెరికా మెడికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కరోనా వైరస్తో పాటు వ్యాక్సిన్ల పనితీరుపై గోప్యత పాటిస్తోన్న చైనా.. తొలిసారి వ్యాక్సిన్ ప్రయోగాల ఫలితాలను అంతర్జాతీయ జర్నల్కు నివేదించింది. తమదేశ వ్యాక్సిన్ల పనితీరుపై అంతర్జాతీయంగా అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ప్రయోగ ఫలితాలను చైనా విడుదల చేసినట్లు సమాచారం.
చైనా నేషనల్ బయోటెక్ గ్రూపునకు చెందిన సినోఫార్మ్తో పాటు సినోవాక్ బయోటెక్ సంస్థలు కరోనాను నిరోధించే రెండు వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాయి. వైరస్ను ఎదుర్కోవడంలో వాటిలో ఒకటి 72.8శాతం, మరొకటి 78.1శాతం సామర్థ్యం చూపించినట్లు చైనా వెల్లడించింది. వీటికి సంబంధించిన నివేదికలు ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్’ (JAMA)లో ప్రచురితమయ్యాయి. అయితే వ్యాక్సిన్ల సామర్థ్యంపై ఫిబ్రవరిలోనే ఆయా సంస్థలు ప్రకటన చేసినప్పటికీ ప్రయోగ నివేదికలను మాత్రం ఇప్పుడే బహిర్గతం చేశాయి.
తీవ్ర ఇన్ఫెక్షన్లు లేవు..
అమెరికా జర్నల్ నివేదిక ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్టు, జోర్డాన్ దేశాల్లో 40,832మందిపై రెండు వ్యాక్సిన్ల ప్రయోగాలు జరిపారు. మూడు వారాల గడువులో రెండు డోసులను ఇచ్చి పరీక్షించారు. వీటిలో వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎవ్వరికీ ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్ర లక్షణాలు కనిపించకపోగా.. ప్లాసిబో తీసుకున్న ఇద్దరిలో వైరస్ లక్షణాలు కనుగొన్నారు. ముఖ్యంగా పురుషుల్లో ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. మహిళల్లో టీకాల సామర్థ్యం కాస్త తక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ వీటిలో సినోఫార్మ్ వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మధ్యే ఆమోదం తెలుపగా, మరో వ్యాక్సిన్పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ ఫలితాలను మార్చిలోనే అమెరికా జర్నల్కు అందజేయగా, వీటిని ప్రచురించేందుకు మే 12న అంగీకరించినట్లు చైనా సంస్థ సినోఫార్మ్ వెల్లడించింది.
ఆది నుంచి అనుమానాలే..
కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తోన్న సంస్థలు వివిధ దశల్లో వాటి ప్రయోగ ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాయి. కానీ, ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా మహమ్మారి గురించి చైనా మొదటి నుంచి గోప్యత పాటిస్తోంది. హంగేరీ, సెర్బియా, సీషెల్స్, పెరూ, చిలీ దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసినప్పటికీ, వాటి సమర్థత గురించిన ఫలితాలను మాత్రం ప్రకటించలేదు. ఇదే సమయంలో వందశాతం వ్యాక్సిన్ పంపిణీ చేసిన సీషెల్స్లో మళ్లీ వైరస్ ఉద్ధృతి కావడంతో టీకా పనితీరుపై అనుమానాలు బయలుదేరాయి. వ్యాక్సిన్లపై పారదర్శకంగా ఉండకపోవడంతో టీకాల పనితీరుపై పలు దేశాల నుంచి చైనా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అంతేకాక, చైనా వ్యాక్సిన్లకు ఆయా దేశాల్లోని నియంత్రణ సంస్థలు కూడా అనుమతుల ప్రక్రియను నిలిపివేశాయి. హాంగ్కాంగ్, సింగపూర్లోనూ ఇదేవిధమైన అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ల సామర్థ్యంపై పూర్తి ఫలితాలను తప్పనిసరిగా వెల్లడించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది.
ఇదిలాఉంటే చైనా తయారు చేసిన రెండు వ్యాక్సిన్లలో సినోఫార్మ్ అనుమతి పొందగా.. సినోవాక్ వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇంకా అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 38 కోట్ల డోసులను చైనా సరఫరా చేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..